చరిత్రలో  ఈరొజు  మే 16  సంఘటనలు

 


 చరిత్రలో  ఈరొజు


 మే 16  సంఘటనలు


1532: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు.


1763: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్ , మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.


1770 : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.


1801: విలియం సెవార్డ్ , (రాష్ట్ర కార్యదర్శి) సెక్రటరీ అఫ్ స్టేట్ (అమెరికా), రష్యా నుండి అలస్కా ను 1867 లో 7.2 మిలియన్ డాలర్లకు కొన్నాడు. ఆ రోజుల్లోని, అమెరికా ప్రజలంతా, సెవార్డ్ పిచ్చి పనులు అనేవారు. యుద్ధతంత్ర రీత్యా,, అలాస్కా ప్రాముఖ్యత ఏమిటో నేటి అమెరిక ప్రజలకు తెలుసు.


1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తి ప్రకటించింది.


1824: లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు.


1831: మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ హ్యుస్, పుట్టాడు.


1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.


1929: మొదటి అకాడమీ అవార్డులు, హాలీవుడ్దగ్గర ఉన్న రూజ్వెల్ట్ హోటల్ లో ఒక విందు సమయంలో బహూకరించారు. వింగ్స్ సినిమా ఉత్తమచత్రం, ఎమిల్ జన్నింగ్స్ ఉత్తమ నటుడు, జానెట్ గేనర్ ఉత్తమ నటి.


1969: మానవరహిత సోవియట్ అంతరిక్ష నౌకవీనస్-5, శుక్రగ్రహం ఉపరితలంపై అడుగుపెట్టింది.


1975: జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్,మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ.


1992: స్పేస్ షటిల్ ఎండీవర్ తన మొదటి రోదసీ ప్రయాణం, సుఖంగా ప్రయాణించి, తిరిగి, కాలిఫోర్నియా ఎడారిలో సురక్షితంగా దిగింది..


1996: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు
1997: రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతోఅమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) "


2006: భారతదేశం అగ్ని-III బాలిస్టిక్ క్షిపణి యొక్క ప్రయోగ పరీక్షను, వాయిదా వేసింది.


2007: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.


2007: లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.


 *🌷జననాలు🌷* 


1923: డా. లింగం సూర్యనారాయణ, శస్త్రచికిత్స నిపుణులు.


1960: సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత.


1978: సొమా బిశ్వాస్, భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి.


 *🍁మరణాలు🍁* 


1830: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (జ.1768)


1908: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు


1950: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914)


1999: మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్‌) స్థాపకుడు.


2018: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image