కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష

- 10-5-2020* --


*ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష చేస్తున్న  కేంద్ర బృందం ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్*


*జిల్లా జనాభా, విస్తీర్ణం, తదితర వివరాలతో పాటు గ్రామం/మండలం,  పట్టణం/మునిసిపాలిటీ వారీగా, జెండర్, వయసు వారీగా జిల్లాలో మొదటి కరోనా కేసు నొసం నుండి నిన్నటి వరకు వారం, వారం..నమోదు అయిన కేసుల వివరాల గ్రాఫ్, రికవరీ బాగా అయి 42 శాతం డిశ్చార్జెస్, 15 మరణాలు( సుమారు 2.71 శాతం), 46 పెరిమీటర్/స్ట్రీట్  కంటైన్మెంట్ క్లస్టర్స్ వారీగా కేసుల వివరాలు,  రాష్ట్రంలోనే  17,399 సాంపిల్స్ కలెక్షన్స్, టెస్టింగ్ లో రాష్ట్రంలో 3 వ స్థానం, 1136 సాంపిల్స్ రిజల్ట్స్ పెండింగ్,  కోవిడ్ ల్యాబ్స్ టెస్టింగ్, ట్రేసింగ్,  హాస్పిటల్స్ సన్నద్ధత, కర్నూలు జిజిహెచ్ రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి,విశ్వభారతి, శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి లలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ వివరాలు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల వివరాలు,  క్వారం టైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహణ, రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా కర్నూలు లో హాస్పిటల్ కాని చైతన్య కాలేజ్ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మంది కోవిడ్ విజేతల డిశ్చార్చ్,  కోవిడ్ ఆస్పత్రుల నుండి 80 సంవత్సరాల వృద్ధుడు, ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్నారి బాలిక  కోవిడ్ ను జయించి డిశ్చార్చ్ కావడం,  మెటీరియల్ నిర్వహణ,  పీపీఈ లు, ఎన్95 మాస్కులు, మందుల ను కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేసారని, కర్నూలు, నంద్యాల  కంటైన్మెంట్ క్లస్టర్ లలో  నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ డోర్ డెలివరీ, మొబైల్ రైతు బజార్లు, కోవిడ్ వైరస్ జాగ్రత్తలు,  అవగాహన చర్యలు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డిశ్చార్చ్ అయిన కోవిడ్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.2000/- నగదు ఇచ్చి పంపడం, సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి 3 మాస్కుల ప్రకారం రెడ్ జోన్స్ లో మొదటి దశలో ఉచితంగా 65 లక్షల మాస్కుల పంపిణీ ఇలా.. మొత్తం ..కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా యంత్రాంగం తీసుకున్న మొత్తం  చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పిపిటి) ద్వారా కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* 


*పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో రెండవ అతిపెద్ద జిల్లా కర్నూలు లో జిల్లా కలెక్టర్ సహకారంతో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిస్థితి వివరాలను,  జియో ఫెన్సింగ్, డ్రోన్స్  టెక్నాలజీ ద్వారా రెడ్ జోన్స్ లో పర్యవేక్షణ, పోలీస్ పెట్రోలింగ్  పెరిమీటర్ కంటైన్మెంట్,  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ తదితర అన్ని వివరాలను, కేసుల వివరాలను, దాదాపు 11500 వేల వాహనాల సీజ్ ,సుమారు రూ.3.50 కోట్ల ఫైన్ వసూలు, కేసుల వివరాలను వివరించిన ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప.,పాల్గొన్న జేసీ రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప,  మునిసిపల్ కమీషనర్ డీకే బాలజీ, కోవిడ్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా.కమల్ రాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధేకరే, జేసీ2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, జిల్లా స్థాయి నోడల్ అధికారులు. ఈ మధ్యాహ్నం కలెక్టరేట్, జిల్లా పరిషత్ లలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్, నోడల్ టీమ్స్ ఏర్పాట్లను పరిశీలించనున్న కేంద్ర బృందం.