కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష

- 10-5-2020* --


*ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష చేస్తున్న  కేంద్ర బృందం ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్*


*జిల్లా జనాభా, విస్తీర్ణం, తదితర వివరాలతో పాటు గ్రామం/మండలం,  పట్టణం/మునిసిపాలిటీ వారీగా, జెండర్, వయసు వారీగా జిల్లాలో మొదటి కరోనా కేసు నొసం నుండి నిన్నటి వరకు వారం, వారం..నమోదు అయిన కేసుల వివరాల గ్రాఫ్, రికవరీ బాగా అయి 42 శాతం డిశ్చార్జెస్, 15 మరణాలు( సుమారు 2.71 శాతం), 46 పెరిమీటర్/స్ట్రీట్  కంటైన్మెంట్ క్లస్టర్స్ వారీగా కేసుల వివరాలు,  రాష్ట్రంలోనే  17,399 సాంపిల్స్ కలెక్షన్స్, టెస్టింగ్ లో రాష్ట్రంలో 3 వ స్థానం, 1136 సాంపిల్స్ రిజల్ట్స్ పెండింగ్,  కోవిడ్ ల్యాబ్స్ టెస్టింగ్, ట్రేసింగ్,  హాస్పిటల్స్ సన్నద్ధత, కర్నూలు జిజిహెచ్ రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి,విశ్వభారతి, శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి లలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ వివరాలు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల వివరాలు,  క్వారం టైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహణ, రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా కర్నూలు లో హాస్పిటల్ కాని చైతన్య కాలేజ్ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మంది కోవిడ్ విజేతల డిశ్చార్చ్,  కోవిడ్ ఆస్పత్రుల నుండి 80 సంవత్సరాల వృద్ధుడు, ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్నారి బాలిక  కోవిడ్ ను జయించి డిశ్చార్చ్ కావడం,  మెటీరియల్ నిర్వహణ,  పీపీఈ లు, ఎన్95 మాస్కులు, మందుల ను కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేసారని, కర్నూలు, నంద్యాల  కంటైన్మెంట్ క్లస్టర్ లలో  నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ డోర్ డెలివరీ, మొబైల్ రైతు బజార్లు, కోవిడ్ వైరస్ జాగ్రత్తలు,  అవగాహన చర్యలు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డిశ్చార్చ్ అయిన కోవిడ్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.2000/- నగదు ఇచ్చి పంపడం, సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి 3 మాస్కుల ప్రకారం రెడ్ జోన్స్ లో మొదటి దశలో ఉచితంగా 65 లక్షల మాస్కుల పంపిణీ ఇలా.. మొత్తం ..కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా యంత్రాంగం తీసుకున్న మొత్తం  చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పిపిటి) ద్వారా కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* 


*పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో రెండవ అతిపెద్ద జిల్లా కర్నూలు లో జిల్లా కలెక్టర్ సహకారంతో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిస్థితి వివరాలను,  జియో ఫెన్సింగ్, డ్రోన్స్  టెక్నాలజీ ద్వారా రెడ్ జోన్స్ లో పర్యవేక్షణ, పోలీస్ పెట్రోలింగ్  పెరిమీటర్ కంటైన్మెంట్,  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ తదితర అన్ని వివరాలను, కేసుల వివరాలను, దాదాపు 11500 వేల వాహనాల సీజ్ ,సుమారు రూ.3.50 కోట్ల ఫైన్ వసూలు, కేసుల వివరాలను వివరించిన ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప.,పాల్గొన్న జేసీ రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప,  మునిసిపల్ కమీషనర్ డీకే బాలజీ, కోవిడ్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా.కమల్ రాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధేకరే, జేసీ2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, జిల్లా స్థాయి నోడల్ అధికారులు. ఈ మధ్యాహ్నం కలెక్టరేట్, జిల్లా పరిషత్ లలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్, నోడల్ టీమ్స్ ఏర్పాట్లను పరిశీలించనున్న కేంద్ర బృందం.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image