కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులు : అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


                                                                                                తేది : 06.05.2020
                                                                                                            అమరావతి.


*కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులు*


• *ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యం.*
• *దశలవారిగా మద్యనిషేదం అమలుకు కట్టుబడి ఉన్నాం.*
• *మద్యపాన నిషేధానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు* 
• *మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట.*
• *ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం*   : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


అమరావతి 6,మే : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతులిచ్చినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి తెలిపారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని తన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచినట్లే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశంపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితం అన్నారు.  రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచే అంశంలో కొందరు మహిళల నుండి వ్యక్తమవుతున్న ఆందోళనలు ఎంతమాత్రం నిజంకాదన్నారు. వారంతా కొందరు పనిగట్టుకొని రెచ్చగొడుతున్న వ్యక్తులే అని ఆరోపించారు.  


తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేదం అమలు చేసి తీరుతామని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణలో భాగంగా మద్యం జోలికి వెళ్ళాలంటే షాక్ తగిలే ధరలను 75 శాతం పెంచడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా 70 శాతం మేర మద్యం ధరలను అక్కడి ప్రభుత్వాలు పెంచాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వ హయాంలోని 43 వేల బెల్ట్  షాపులను తొలగించారన్నారు. అదే విధంగా ప్రతీ ఏటా 20శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వాటితో పాటు ప్రతీ ఏటా 25శాతం మద్యం ధరలు పెంచుకుంటూ పోతున్నామని తెలిపారు. 


రాష్ట్రంలో ఎక్కడా బార్ షాపులను తెరవలేదని మంత్రి స్పష్టం చేశారు. మద్యం ధరలను పెంచుకుంటూ పోవడం ద్వారా పేదలు వాటి జోలికి పోకుండా ఉంటారన్న నమ్మకం ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే అమ్మఒడి, రైతుభరోసా, విద్యావసతి దీవెన, సున్నా వడ్డీకే మహిళలకు రుణాల పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అదే విధంగా చేనేతలకు, మత్స్యకారులకు, మహిళలకు ఆర్థికసాయం అందించే పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న పలు బకాయిలు తీర్చామన్నారు. కరోనా లాంటి క్లిష్ట విపత్తు సమయంలో ప్రజలకు అదనపు రేషన్ అందించామన్నారు. ఈ సందర్భంగా గతంలో కీర్తిశేషులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మద్య నిషేదం అమలు చేసిన వైనాన్ని డిప్యూటి సిఎం నారాయణ స్వామి గుర్తుచేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కలిసి తమకు ఏం చేయకపోయినా మద్యపాన నిషేధం చేస్తే చాలని విన్నవించడంతో దశల వారీగా మద్యనిషేదం అమలు చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకొంటున్న ప్రజానాయకుడు జగన్ అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట జగన్ తప్పరని నారాయణస్వామి తెలిపారు. మద్యపాన నిషేధానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. జే ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం తమ ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. షాపుల ముందు ఎక్కువ మంది ఉంటే షాపులు మూసేయడానికి వెనకాడబోమన్నారు. పేదవాళ్లు బాగుపడాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. సంపాదించిన సొమ్మంతా తాగడానికి కాకుండా కుటుంబానికి ఖర్చుపెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా మద్యం రేట్లు పెంచారన్నారు. వినియోగదారుల సంఖ్య తగ్గించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే ముఖ్యమంత్రి  దృక్పథమన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదన్నారు. ఐడీ, ఎన్డీపీ, గంజాయి, గుట్కాల నిషేధం బాధ్యత ఎస్పీల భుజాన వేశామన్నారు. మద్యం అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. 


ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు మద్యపాన నిషేధానికి తమ వంతుగా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు. అంతేతప్ప రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అన్ని కులాలు, మతాలు, వర్గాల వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. దేవుడు దీవించాడు.. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే తనకు సేవ చేసే అవకాశం దొరికిందని ముఖ్యమంత్రి నమ్ముతారన్నారు. ప్రతి పేదవాడు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్య్శమన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి పక్షానే ఉన్నారన్న విషయం గ్రహించాలన్నారు.


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image