అధికారంలో వున్నా లేకపోయినా కష్టాల్లో వున్న పేద ప్రజలకి అండగా ఉంటాం. :. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్

అధికారంలో వున్నా లేకపోయినా కష్టాల్లో వున్న పేద ప్రజలకి అండగా ఉంటాం. :. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


ఉయ్యురు :.     నగర పంచాయతీ 13 వ వార్డులో సుందరంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు *రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్* ల సహకారంతో అనారోగ్యంతో వున్న  పైలా నందిని అనే పేద విద్యార్థినికి  వైద్య ఖర్చుల నిమిత్తం 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన  ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* 


ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ ఇటీవలే నేను సుందరంపేటలోని 13, 14 వార్డుల్లో పర్యటనకు వచ్చినప్పుడు నందిని అనే అమ్మాయి అనారోగ్యంగా ఉందని సుందరంపేట తెలుగుదేశం నాయకులు నా దృష్టికి తీసుకురావటంతో నేను వెంటనే క్యాపిటల్ హాస్పిటల్ వారితో మాట్లాడి వైద్యం చేయించానని, దానిలో భాగంగానే ఈ రోజు 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశామని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే CMRF ద్వారా ఇంకా పెద్ద మొత్తంలో ఆదుకొనేవాళ్లమని,గతంలో ఉయ్యురు చుట్టు ప్రక్కల ప్రజలకు సుమారు 15 కోట్ల రూపాయలు నేను చంద్రబాబు గారితో చెప్పి CMRF ద్వారా ఇచ్చామని, ఇప్పటి ప్రభుత్వం పేదలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు. 


అలాగే అక్కడ వున్న స్థానిక మహిళలు ఒక్క సారి చూద్దాం అని జగన్ కి ఓటు వేసి తప్పు చేశామని, మొన్నటి వరకు ఇసుక దొరక్క పనులు లేక ఇబ్బందులు పడితే, ఇప్పుడు కరోనా వచ్చి ఇల్లు గడవక మాకుటుంబాల పరిస్థితి దారుణంగా వున్నా ఎవ్వరు పట్టించుకోవటంలేదని *రాజేంద్ర ప్రసాద్* గారితో అన్నారు 


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు,పొగిరి రాము, నడిమింటి పైడయ్య, జగరోతు లక్ష్మణ, మీసాల అప్పలనాయుడు, తౌడు, బూరెల నరేష్, బోనంగి సత్యం, డా.రాంబాబు, యడ్ల శ్రీను, లంకా రాము, అలిబిల్లి శ్రీను, పల్లి వెంకటేశ్వర్లు మరియు రాజేంద్ర యువత సభ్యులు చెదుర్తిపాటి ప్రవీణ్, జంపన వీర శ్రీనివాస్, ఈడే అంజిబాబు, శ్యామల రావు మరియు 13,14 వ వార్డ్ సుందరంపేట యువత  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image