వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు

వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు


వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం నల్లగొండ గ్రామానికి చెందిన వ్యక్తులు చెన్నై నుండి వచ్చి కోరం టైమ్స్ లో ఉన్నారు. వారికి ఆదివారం ప్రభుత్వ వైద్యాధికారి హరికృష్ణ కోవిడ్-19 క్విట్లు ద్వారా 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు తాసిల్దార్ ఎం వి సుధాకర్ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో పాజిటివ్ రావడంతో వారిని నెల్లూరు తరలించి ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేయవలసి ఉందని ఎస్సై బాజిరెడ్డి తెలిపారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వారిని నెల్లూరు     104 అంబులెన్స్ ద్వారా నెల్లూరు కు తరలించారు.  ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయితే వింజమూర్ లో రెడ్ జోన్ గా మారే పరిస్థితి ఉంది. కనుక ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండీ బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి వివరాలు అందజేయాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, ఆత్మకూరు డి.యల్.పి.ఓ అప్పాజీ, ఇంచార్జ్ ఈ.ఓ.పి.ఆర్.డి బంకా.శ్రీనివాసులురెడ్డి, పంచాయితీ కార్యదర్శి డి.ఖాజా రహంతుల్లా, వి.ఆర్.ఓ ఎస్.కే.రంతుల్లా తదితరులు నల్లగొండ్ల గ్రామంలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image