కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ -దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్...

*కలిగిరి మార్కెటింగ్ యార్డులో 250 బస్తాల ధాన్యం అపహరణ* దర్యాప్తు చేపట్టిన కలిగిరి సి.ఐ రవికిరణ్.... ఉదయగిరి, మే 3 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోకవర్గంలోని కలిగిరి మండలం జిర్రావారిపాళెం మార్కెటింగ్ యార్డులో రైతులు నిల్వ ఉంచిన దాదాపు 250 ధాన్యం బస్తాలు శనివారం రాత్రి అపహరణకు గురయ్యాయి. ఆదివారము తెల్లవారుజామున రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెటింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తదుపరి అధికారులు, రైతులు కలిగిరిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే కలిగిరి మండలంలోని జిర్రావారిపాళెం మార్కెట్ యార్డులో రైతుబంధు పధకం కింద జలదంకి మండలంలోని బ్రాహ్మణకాక గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుబ్బరత్నమ్మ అనే రైతులు 2018లో ధాన్యం నిల్వ చేశారు. అందుకు సంబంధించి వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిపాజిట్ నగదును పొందారు. అయితే ఇటీవల ఆశించిన ధర రావడంతో నిల్వ ఉంచిన ధాన్యమును విక్రయించుకునేందుకు రైతులు సన్నద్దమయ్యారు. మార్కెటింగ్ శాఖ అధికారులకు డిపాజిట్ గా తీసుకున్న నగదును చెల్లించారు. ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అధికారుల అనుమతితో ఆదివారం ఉదయం సదరు రైతులు మార్కెట్ యార్డుకు తరలివెళ్ళిన సమయంలో షట్టర్లు తీయగా ధాన్యం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న వారు ఈ విషయమును మార్కెట్ కమిటీ అధికారులకు తెలియపరిచారు. వారు వచ్చిన అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కలిగిరి సి.ఐ రవికిరణ్, ఎస్.ఐ వీరేంద్రబాబులు మార్కెట్ యార్డుకు వెళ్ళి పరిశీలించారు. ధాన్యం మాయమైన తీరు పట్ల యార్డులో ఉన్న పలువురిని ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ సందర్భంగా సి.ఐ రవికిరణ్ విలేకరుల సమావేశంలో  తెలిపారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు