4380 నుంచి 2934కి తగ్గుతున్న మద్యం షాపులు*

*09–05–2020,*
*అమరావతి.*


*మద్య నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు


*ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ*


*తాజాగా మరో 13 శాతం షాపులు తొలగింపునకు ఆదేశాలు జారీ*


*గతంలోనే 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం*


*దీంతో మొత్తం 33 శాతం షాపులను తగ్గించిన ప్రభుత్వం*


*4380 నుంచి 2934కి తగ్గుతున్న మద్యం షాపులు*


*ఈ నెలాఖరు నాటికి 13 శాతం షాపులు తొలగించాలని ఉత్తర్వులు*


*అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్‌ షాపులు తొలగించిన ప్రభుత్వం.


*ప్రజారోగ్యమే  ప్రధాన లక్ష్యం– ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం*


*మద్యం మహమ్మూరిని శాశ్వతంగా పారదోలడమే ప్రభుత్వ లక్ష్యం*


*దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా మద్య నియంత్రణ చర్యలు*


*అమరావతి.*


మద్యపాన నియంత్రణదిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 
మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43000 బెల్టు షాపులను తొలగించింది. దీంతో పాటు ప్రైవేటు వ్యక్తుల మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. 
మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటట్టు నిర్ణయం తీసుకుంది. 
వీటికి అదనంగా మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో పలు చర్యలు తీసుకుంటోంది. 


*ఆ వివరాలు...*


1. లిక్కర్‌ షాపుల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్‌ రూంలను రద్దు చేసింది. 
2. ఒక వ్యక్తి గరిష్టంగా లిక్కర్‌ లేదా బీరు కేవలం మూడు బాటిల్స్‌ వరకు మాత్రమే కొనుగోలుకు అవకాశమిచ్చింది. అంతకు మించి కొనుగోలు చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. 
3. మద్యం అమ్మకాలను తగ్గించేందుకు కాలపరిమితిని విధించింది.
గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాల ఇచ్చిన   కాలపరిమితిని తగ్గించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేసింది.  
4. మద్యం వినియోగాన్ని మరింత గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4380 నుంచి 3500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
5. మద్యం అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, స్వయంగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 
6. మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం కొనాలంటేనే భయపడేలా షాక్‌ కొట్టే విధంగా ధరలను పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంది. 
7. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి.  
8. వీటికి తోడు మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన  ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 ఈ కమిటీ ద్వారా మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 


9. వీటితో పాటు ప్రభుత్వం అక్రమ మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 
10. అక్రమ మద్యం తయారీదారులపై గట్టి నిఘా పెట్టి వారిపై తరచూ దాడులు నిర్వహిస్తోంది.
11. ఫలితంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం అమ్మకాలు, తయారీ, రవాణాపై గట్టి నిఘా పెట్టి పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది. 


*గడిచిన నాలుగేళ్లలో కేవలం జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అక్రమ మద్యం పై తీసుకున్నచర్యల వివరాలు.*


*తెలుగుదేశం పార్టీ హయాంలో*


తెలుగుదేశం పార్టీ హయామంలో 2017లో(జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు) 3,812 కేసులు నమోదు కాగా 2,487 మందిని అరెస్టు చేసి, 30,084 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు.
9,08,320 లీటర్ల పై చిలుకు బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు, 59,049 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని, 191 వాహనాలను సీజ్‌ చేసారు. 


2018లో (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) 3,579 కేసులు నమోదు కాగా 2,763 మందిని అరెస్టు చేసి, 34,540 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు.
అదే పీరియడ్‌లో 6, 58,738 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు, 51,026 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని, 188 వాహనాలకు సీజ్‌ చేశారు.
 
2019లో (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) 5,442 కేసులు నమోదు కాగా, 3,526 మందిని అరెస్టు చేసి 56,179 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
8,98,118 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు 46,594 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 330 వాహనాలను సీజ్‌ చేశారు. 


*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు*


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నియంత్రణ దిశగా  అక్రమ మద్యం అక్రమాల పై  ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. కేవలం 2020 జనవరి నుంచి ఏఫ్రిల్‌ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్నవారిపై7,812 కేసులు నమోదు కాగా, 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఏకంగా 16 లక్షల 41 వేల 134 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 70,161 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న 1541 వాహనాలను సీజ్‌ చేశారు. 


*లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో మద్యపాన నియంత్రణ కోసం ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది.*


*అందులో  భాగంగా..*
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         ఏప్రిల్‌ 22 నుంచి ఇంతవరకు అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం 1462 కేసులు నమోదు చేసి 1282 మందిని అరెస్టు చేసి, 14,759 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3,63,430 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసిన పోలీసులు 12,718 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 428 వాహనాలను సీజ్‌ చేశారు. 


మరోవైపు గ్రామ, వార్డు వాలంటీర్లతో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను కూడా వినియోగించుకుంటూ అక్రమమద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.


వీటికి అదనంగా పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం  గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తరచూ సమావేశాలు నిర్వహించడంతో పాటు  అక్రమ మద్యం తయారీ, నిల్వ దారులపై సంయుక్తంగా దాడులు కూడా నిర్వహించడం ద్వారా మద్యం అమ్మకాలకు చెక్‌ పెడుతోంది. 


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రజలకు సమర్ధవంతమైన పరిపాలన అందించడంతో పాటు ప్రజా ప్రయోజనం దృష్ట్యా మద్యాన్ని నియంత్రించడం మరియు మద్యం అమ్మకాలను కూడా ప్రభుత్వం క్రమబద్దీకరించింది. 


మరోవైపు అక్రమ మద్యం తయారీపై కూడా గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. 
మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ఏపీ స్టేట్‌ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  షాపుల సంఖ్యను 33 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
తద్వారా మొత్తం మద్యం షాపులు 4380 నుంచి తగ్గి ఈ నెలాఖరు నాటికి కేవలం 2934 షాపులు మాత్రమే ఉండనున్నాయి. (తాజాగా 13 శాతం షాపులను తగ్గించాలని జారీ చేసిన ఉత్తర్వులుతో కలుపుకుని)


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image