మండలంలో 44 వేల మాస్కులు పంపిణీ : యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని

 వింజమూరు, మే 9 (అంతిమ తీర్పు     -   దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో కోవిడ్-19 వైరస్ నివారణా చర్యలలో భాగంగా ప్రజలకు 44 వేల మాస్కులను పంపిణీ చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి యస్.కనకదుర్గా భవానీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో వింజమూరు మండలంలో ఈ వైరస్ నివారణకు గానూ మొదటి నుండి కూడా ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఫలితంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ స్వీయ నిర్భంధం పాటిస్తూ ప్రధానంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలనే సంకేతాలను క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంతేగాక ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే ప్రమాదకర పరిస్థితులు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అందజేసిన 44 వేల మాస్కులను మండలంలోని వాలంటీర్లు, కార్యదర్శుల ద్వారా ఒక్కొక్కరికి 3 మాస్కులు వంతున ఇంటింటికీ అందజేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, రెవిన్యూ సిబ్బంది, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సాంఘిక సం క్షేమ వసతిగృహాలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, గ్రామీణ నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు మాస్కులను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించడం ప్రస్తుత పరిస్థితులలో ప్రధమ కర్తవ్యంగా భావించాలన్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైతే మినహా ప్రజలెవరూ రోడ్లు మీదకు రాకూడదని కోరారు. కరోనా వైరస్ చైన్ సిస్టం లాంటిదని, ఒకరిని నుండి మరొకరికి ఈ వైరస్ గాలి ద్వారా వేగంగా సంక్రమించే లక్షణాలు కలిగి ఉన్నందున దాని నివారణకు అవగాహనతో మెలగడమే ముఖ్యమన్నారు. మాస్కులు ధరించడం వలన ఈ వైరస్ ను కొంతమేర 
 రూపుమాపవచ్చునని యం.పి.డి.ఓ పేర్కొన్నారు. కనుక ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అందజేసిన మాస్కులను నిత్యం ధరిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు