రాగల 48 గంటలపాటు  కోస్తాంధ్ర,రాయలసీమకు వర్షసూచన


*విపత్తుల నిర్వహణ శాఖ*
🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨
*ఐఎండి వాతావరణ సూచన*


🌨 దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో  *అల్పపీడనం* ఏర్పడింది. 48 గంటల్లో బలపడి ఆ తదుపరి 48గంటల్లో (నాలుగు రోజులు) వాయుగుండంగా మారే అవకాశం


🌨 *రాగల 48 గంటలపాటు  కోస్తాంధ్ర,రాయలసీమకు వర్షసూచన*



 🌨   *కోస్తాంధ్ర , రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం*


 🌨 *కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం*   


🌨 *సముద్రం అలజడిగా ఉంటుంది.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు:- విపత్తుల శాఖ కమిషనర్*


☀️ *రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం*


*వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు  తీసుకోవాలి :-విపత్తుల శాఖ కమిషనర్*


⛈️ *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి:-విపత్తుల శాఖ కమిషనర్*


*ప్రజలు అప్రమత్తంగా  ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల శాఖ కమిషనర్*


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image