మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోవని రూ.10 లక్షలు ఇస్తున్నాం: ముఖ్యమంత్రి వైఎస్

*06–05–2020*
*అమరావతి*


*అమరావతి:: మే 6 (అంతిమ తీర్పు) : క్యాంపు కార్యాలయంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం  వైయస్‌.జగన్‌, మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని హాజరు.పాల్గొన్న పలువురు మత్స్యకారసంఘాల ప్రతినిధులు.
*వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు.*


*దాదాపు 6 నెలల ముందుగానే!*


కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. మనకున్న కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం: సీఎం
చేపల వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారు:
అది కూడా అందరికీ ఇచ్చేవారు కాదు:
ప్రతి మత్స్యకారుడిలో వెలుగులు కనిపించని పరిస్థితి:
నా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను:
వారి బతుకులు మారాలని తలచి.. ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం:


*నాడు ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పటికీ..:*


గత ఏడాది మే 30న అధికారంలోకి వచ్చాం:
అప్పటికే చేపల వేట నిషేధ సమయం దాదాపు ముగియడంతో ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి:
అయినా సరే గత ఏడాది నవంబరులో మత్స్యకార దినోత్సవం రోజున ‘మత్స్యకార భరోసా’కు శ్రీకారం చుట్టాం:
ముమ్మడివరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. 


*ఆ డబ్బు ఇప్పటికీ రాలేదు:*


అప్పట్లో నేను అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారులు తమ బాధలు చెప్పుకున్నారు. గతంలో జీఎస్‌పీసీ డ్రిల్లింగ్‌ వల్ల 13 నెలలు ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని వాళ్లు చెప్పినప్పుడు.. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబరులో రూ.70.53 కోట్లు వారికి పరిహారం చెల్లించాం:
ఇప్పటికీ ఆ డబ్బు ఇంకా రాలేదు :
ఆ డబ్బు కోసం ఎదురు చూడకూండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం:
మత్స్యకారులకు మంచి జరగాలన్న ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం:


*ఇంకా ఏమేం చేశాం?:*
పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు:
ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు:
మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీలతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాం:
ఇంకా వారు జీవనం కొనసాగించడానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాం:
ఇలా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం:
మొన్న కరోనా కారణంగా గుజరాత్‌లో 4500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే, వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే.. వారికి తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎంతో పాటు, కేంద్ర మంత్రులతో మాట్లాడి, రూ.3 కోట్ల మేర ఖర్చు చేసి.. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చాం:
వారందరికీ పరీక్షలు చేసి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. 
వారికి మేలు చేయడానికి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టాం:


*ఇప్పుడు ఎన్ని కుటుంబాలకు?:*


ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదు:
ఇచ్చినా కూడా అరకొరగా ఇచ్చే వారు. అందరికీ ఇచ్చే వారు కాదు:
కరోనా కష్టాలు ఉన్నా కూడా.. మే 6న ఇవాళ 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం:


*ఇంకా ఏమేం ప్రయోజనాలు..:*


ఇదే కాదు.. డీజిల్‌ సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదని పాదయాత్రలో చెప్పారు:
దీంతో డీజిలు సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచాం:
అంతే కాకుండా డీజిల్ పట్టుకున్నప్పుడే సబ్సిడీ వచ్చేలా చేశాం:
మెకనైజ్డ్‌ బోట్‌కు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నాం:
మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోవని రూ.10 లక్షలు ఇస్తున్నాం:
దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం:


*శాశ్వత చర్యలు:*


మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని.. గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత పరిష్కారంగా..బాధ్యతలు చేపట్టిననాటి నుంచి మంత్రి మోపిదేవి ఎంతో కృషి చేసి.. వీటికి అనుమతులు తీసుకొచ్చారు:


8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాం:
శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్లు.


*1 ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రం:*


శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నాం:


*ఎంత వ్యయం?:*
వీటన్నింటికీ దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కానుంది. 
3 సంవత్సరాల్లో ఈ తొమ్మిదింటి నిర్మాణం చేస్తాం :
వాటిని పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తాం
శాశ్వతంగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  చేస్తున్న కార్యక్రమాలు:
గుజరాత్‌కు వలస పోవడమన్నది దశాబ్దాల కాలంగా జరుగుతోంది:
గత ప్రభుత్వంలో మూడే మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల కోసం కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు:
 అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.


ఆ తర్వాత వివిధ జిల్లాల నుంచి మత్స్యకారులు స్పందించారు.


*కె.శిరీష. శ్రీకాకుళం జిల్లా:*
– ‘మా ఆయన అనుకోకుండా పాకిస్తాన్‌ సైనికుల చేతిలో చిక్కి జైలులో మగ్గిపోతే, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని జైలు నుంచి విడిపించారు. అంతే కాకుండా రూ.5 లక్షలు ఇచ్చారు. దీంతో మేము బోటు కొనుక్కుని ఇక్కడే బ్రతుకుతున్నాం. అనేక సంక్షేమ పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో రేషన్‌ ఇచ్చారు. డబ్బులు కూడా ఇచ్చారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా బోట్లకు బీమా సౌకర్యం కల్పించమని వేడుకుంటున్నాము’.



*మైలపల్లి పోలీసు. శ్రీకాకుళం జిల్లా:*
– ‘గత ప్రభుత్వ హయాంలో చేపల వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఇచ్చేవారు. అది ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. పార్టీ వారికి మాత్రమే ఇచ్చేవారు. ప్రజాసంకల్పయాత్రలో మా బాధలను మీకు చెప్పాం. దేవుడి దయతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.10 వేలు ఇస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ డబ్బు ఇస్తున్నారు. మీకు రుణపడి ఉన్నాం. అలాగే ప్రతి మత్స్యకారుడికి పెన్షన్‌ కింద రూ.2250 ఇస్తున్నారు. మాకు డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు’.
 ‘కరోనా వైరస్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన సుమారు 4500 మంది అనేక రకాలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మీకు తెలియజేయగానే మీరు వారిని రప్పించారు. మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’.


*బలగం వీరరాఘవయ్య. కృష్ణా జిల్లా:*
– ‘మాకు గతంలో ఎప్పుడూ సరైన సమయానికి సహాయం అందలేదు. కానీ మీరు వచ్చాక కచ్చితంగా చెప్పి మరీ ఇస్తున్నారు. పార్టీ అని చూడకుండా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. ఇవాళే మీరు రూ.10 వేలు ఇస్తున్నారంటే మాలో చాలా మంది నమ్మడం లేదు. గత ఏడాది కూడా మీరు చెప్పిన తేదీకి సహాయం అందించారు’.
 ‘నేను 1977 నాటి తుపాను కూడా చూశాను. అప్పటి నుంచి నేను చేపలవేటపైనే ఆధారపడ్డాను. కానీ ఏనాడూ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోలేదు. డీజిల్‌ సబ్సిడీ బిల్లులు దాచుకుని, ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ మీరు ఆ సబ్సిడీ వెంటనే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మా వంటి పేదల కోసం అమ్మ ఒడి పథకం. రూ.15 వేలు ఇచ్చారు. నాకు తెలిసిన అందరికి డబ్బులు వచ్చాయి. డీజిల్‌ సబ్సిడీ రూ.9 వెంటనే అందుతోంది. అందుకు ఎంతో సంతోషం’.
 ‘మాలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఎమ్మెల్యే వరకే పరిమితం అయ్యారు. కానీ మీరు మాలో ఒకరైన మంత్రి మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపిస్తున్నారు. అందుకు రుణపడి ఉంటాం. అదే విధంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌ను కచ్చితంగా అమలు చేయండి. మా పిల్లలను ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివించండి’.


*జెల్ల లక్ష్మి, ప్రమాదంలో భర్త చనిపోయిన మహిళ. కృష్ణా జిల్లా:*


– ‘ మీ రుణం తీర్చుకోలేను. నా భర్తను కోల్పోయి బాధల్లో  ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు నాకు అండగా నిలబడ్డారు. జగనన్న చేసిన మేలును ఎప్పుడూ మరిచిపోలేను. కష్టం వచ్చిందని తెలియగానే ఇంత త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకోగా, స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ‘ధైర్యంగా ఉండమ్మా..’ అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు.


*పోతురాజు, గచ్చికాయలపురం, తూ.గో. జిల్లా:*
– ‘మీ పాదయాత్రలో మా సమస్యలను నివేదించాం. గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నుంచి పరిహారం ఇప్పించాలని కోరాం. 63 గ్రామాల ప్రజలు 103 రోజులు పోరాటం చేశారు. 13 నెలలకు పరిహారం ఇస్తామని వారు చెప్పారు. కానీ 6 నెలలకు మాత్రమే ఇచ్చి.. మిగతా డబ్బు ఇవ్వలేదు. గ్రాఫిక్స్‌ సీఎం వచ్చి ఆ విషయాన్ని మరిచిపోయారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. మీరు వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతో మంది సీఎంలు వచ్చారు, వెళ్లారు. మత్స్యకారులకు మీరు చేసినట్టుగా మరెవ్వరూ సేవ చేయలేదు’.


*గరికిన యోహాను, సూర్యారావుపేట, కాకినాడ:*
– ‘గత ప్రభుత్వ హయంలో డబ్బు సరిగా వచ్చేది కాదు. మీరు ఇస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా మా పిల్లలను చదివించుకునేందుకు మీరు సహాయపడుతున్నారు. నా ఇద్దరు బిడ్డలూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుండడంతో వారు సంతోషంగా బడికి వెళ్తున్నారు. అలాగే మత్స్యకారుల బిడ్డలకు వాలంటీర్‌ పోస్టులు కూడా ఇచ్చారు. మాకు చాలా సేవ చేస్తున్నారు. వృద్ధులకు చాలా ఉపయోగం. పది కాలాలు మీరు చల్లగా ఉండాలి. కరోనా సమయంలో కూడా మీరు ఉచితంగా రేషన్‌ ఇచ్చారు, డబ్బు చేతిలో పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నాం’. 


*బర్రి పోలయ్య,మత్స్యకారుడు, విజయనగరం జిల్లా:*
– ‘జెట్టీలు, హార్బర్లు లేకపోవడం వల్లే మేం వలసపోతున్నామనే విషయాన్ని మీకు పాదయాత్రలో నివేదించాం.
 ఆ మాటలన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషకరం. పాకిస్థాన్‌ జైలు నుంచి తిరిగి వస్తామని మా మత్స్యకారులు అనుకోలేదు. కాని మీరు తీసుకు
వచ్చారు. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం’.


*ధనరాజ్, నెల్లూరు జిల్లా:*


– ‘గతంలో భరోసా పేరుతో 25 కేజీల బియ్యం, రూ.2 వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ మొత్తం రూ.4 వేలు చేసినా, అందరికీ ఇచ్చే వారు కాదు. ఊళ్లో కొందరికే వచ్చేది. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బు అరకొరగా కొందరికే ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా మంచి చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. వైయస్సార్‌ గారు దూరం అయ్యాక మాకు వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారుడ్ని మరిచిపోయింది. ఇప్పుడు అందరికీ సంతృప్తికర స్థాయిలో అన్నీ వస్తున్నాయి. గంగమ్మతల్లి తర్వాత మీరే మాకు దేవుడిలా నిల్చారు’.


*నర్సింగ్‌రావు, బోటు యజమాని. విశాఖపట్నం*


– ‘గతంలో మాకు కొంత మాత్రమే సబ్సిడీ వచ్చేది. మీరు వచ్చాక ఆ మొత్తం పెంచారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచి వెంటనే ఇచ్చేస్తున్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చారు. నేను విన్నాను. నేను విన్నాను. అన్నారు. అందువల్ల మీరు ఉన్నారన్న భరోసా, నమ్మకం ఎంతో ఉంది. మాలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇది మా అందరికీ గౌరవం. మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కుటుంబానికి పెద్దకుమారుడు మీరు’. 


 ఆ తర్వాత విజయనగరం నుంచి మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా పూసపాటిరేగమండలం చింతపల్లి లేదా కోనాడలో ఫిషింగ్‌ జెట్టీ నిర్మించాలని కోరడంతో సీఎం అంగీకరించారు.


 చివరగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ‘ అధికారంలోకి వచ్చాక రెండోసారి ఈ కార్యక్రమం, కేవలం ఏడు నెలల వ్యవధిలోనే చేస్తున్నామని,  దేవుడి దయతో ఇంకా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ బటన్‌ నొక్కి మత్స్యకారభరోసాను ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,09,231 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image