జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింపచేయాలి  -- ఏపిజేయఫ్ నెల్లూరు జిల్లా కమిటీ

జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింపచేయాలి  -- ఏపిజేయఫ్ నెల్లూరు జిల్లా కమిటీ
  
 నెల్లూరు:మే 12 :ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డి గారికి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించగలరని కోరుతూ ఏపిజేయఫ్ రాష్ట్ర విజ్ఞప్తి లేఖను రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి ఆనీల్ కుమార్ యాదవ్ గారి ద్వారా ముఖ్యమంత్రివర్యులకు అందజేయగలరని వినతిని ఇవ్వటం జరిగింది .ప్రతి జర్నలిస్టుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని,జర్నలిస్టులకు రూ 50 లక్షల బీమా వర్తింపజేయాలని,క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు యన్ - 95 మాస్క్ లను,శానిటైజర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించాలని,జర్నలిస్టుల కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు,కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని,నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు కేటాయించాలని,జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పట్టణ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) విజ్ఞప్తి చేసింది.కరోనా వైరస్ నియంత్రణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపిజేయఫ్ తెలియజేసింది.కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న డాక్టర్లు,వైద్య సిబ్బంది,పోలీసులు,రెవెన్యూ,పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకు ఏపీ జే ఎఫ్ అభినందనలు తెలిపింది.


నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు సి.ఎస్. ఆర్ నిధులతో నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు),అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ,ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బుసింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్.దిలిప్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు, ఓ. వెంకటేశ్వర్లు,  జాయింట్ సెక్రెటరీ జయ కుమార్ సింగ్ కమిటీ సభ్యులు శ్రీ హరి ప్రసాద్,          వి.రమేష్ కుమార్,  అంతిమ తీర్పు పత్రిక ఎడిటర్ వల్లూరు ప్రసాద్ కుమార్ , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు