రేపే  (6వ తేదీ) వైయస్సార్‌ మత్స్యకార భరోసా పధకం చెల్లింపులు

*05.05.2020*
*అమరావతి.   


రేపే  (6వ తేదీ) వైయస్సార్‌ మత్స్యకార భరోసా పధకం చెల్లింపులు


*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం*
*సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా*
*దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం*
*లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం*
*గత ఏడాది నవంబరులో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం*
*ఈ ఏడాది ఎన్ని కష్టాలున్నా మే నెలలోనే మత్స్యకారభరోసా పథకం అమలు*
*‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని తన సుదీర్ఘ పాదయాత్రలో హామీ*
*ఆ మాటలు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌*


అమరావతి:


అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకుఇచ్చే పరిహారాన్ని రూ.10 వేలకు పెంచడంతో పాటు, గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజు ఆ మొత్తం చెల్లించగా, ఈసారి మే నెలలోనే వారికి ఆర్థిక సహాయం చేస్తోంది. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు బుధవారం నాడు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఈ సహాయం చేయడం ఒక విశేషం కాగా, దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి నేపథ్యంలో, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా, సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటూ, వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలోనే అమలు చేస్తోంది. 
 
*ఎవరెవరికి?*
 సముద్రంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధ సమయంలో గతంలో మత్స్యకార కుటుంబాలకు 2018 వరకు రూ.4 వేల చొప్పున సహాయం చేయగా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. అంతే కాకుండా 2018 వరకు వరకు మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికి మాత్రమే ఆ సహాయం అందగా, 2019 నుంచి దేశీయ నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా రూ.10 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం రోజున ఆ సహాయం అందించగా, ఈసారి 6 నెలల ముందుగానే,  బుధవారం మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నారు. 


*ఇంకా ఏమేం చేశారు?*
*డీజిల్‌పై సబ్సిడీ పెంపు. తక్షణమే చెల్లింపు:*


 మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేపల వేట కోసం మత్స్యకారులు వినియోగించే పడవలకు 2019 వరకు లీటరు డీజిల్‌పై రూ.6.03 గా ఉన్న సబ్సిడీని రూ.9 కి పెంచడంతో పాటు, ఆ రాయితీ తక్షణమే అందిస్తున్నారు. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్‌కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశారు.మత్స్యశాఖకుచెందిన 6 డీజిల్‌ బంకులతో పాటు, ప్రభుత్వం గుర్తించిన 68
 ప్రైవేటు బంకుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుండగా, చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు పథకం వర్తింప చేస్తున్నారు. 


*రూ.10 లక్షల పరిహారం*


 సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. 


*పాకిస్తాన్‌ చెర నుంచి*


 సముద్రంలో తమ జలాల్లోకి ప్రవేశించారంటూ రాష్ట్రానికి చెందిన 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ భద్రతా బలగాలు 2018 నవంబరులో అరెస్టు చేశాయి. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు 5గురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. వారిని విడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఆ మత్స్యకారులంతా పాక్‌ జైలు నుంచి సురక్షితంగా విడుదలయ్యారు. స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లిన మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆ మత్స్యకారులకు స్వాగతం పలికి రాష్ట్రానికి తీసుకు వచ్చారు. వారందరిని వారి స్వస్థలాలకు పంపడంతో పాటు, ఒక్కొక్కరికి జీవన ఉపాధి కోసం రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించింది.


*కేంద్రం తరపున..*


 గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ 2012లో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్‌ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 68 గ్రామాలకు చెందిన 5060 పడవలు చేపలవేటకు వెళ్లలేకపోయాయి. దీంతో 16,559 మంది మత్స్యకారులు జీవనభృతి కోల్పోయారు. 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్‌ జరగగా, జీఎస్‌పీఎస్‌ సంస్థ వారికి 6 నెలలకు గానూ రూ.68.88 కోట్లు చెల్లించింది. మిగిలిన 7 నెలలకు సంబంధించి రూ.70.53 కోట్లు ఇవ్వలేదు. 
 అయితే ఆ సొమ్ము చెల్లిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, రూ.70.53 కోట్లు కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజున చెల్లించారు. 


*4300 మంది మత్స్యకారుల తరలింపు*
 గుజరాత్‌ తీరం వెంట సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 4300 మంది మత్స్యకారులు కరోనా తాకిడితో అక్కడే చిక్కుబడి పోగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారికి అక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఖర్చుకు వెనకాడకుండా ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా అందరినీ సురక్షితంగా ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి తీసుకువచ్చారు. 


*ఫిష్‌ ల్యాండింగ్, ఫిషింగ్‌ హార్బర్లు*
 కోస్తా జిల్లాలలో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు మెరుగు పర్చడమే కాకుండా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో 3 కొత్త ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్న నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్లను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
 శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంలో కేంద్రం వాటాకు సంబంధించి రూ.144.40 కోట్లకు గానూ మొదటి విడతగా రూ.18 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు  మత్స్యకారులకు అండగా నిల్చేందుకు 725 మంది గ్రామ మత్స్య సహాయకులను కూడా ప్రభుత్వం నియమించింది.


*ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ..*
 ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోతోంది. ఒకవైపు ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోవైపు కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో, లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.


Popular posts
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి