యేడాది కాలంలో ఎస్.ఐ బాజిరెడ్డి తీరు భేష్

యేడాది కాలంలో ఎస్.ఐ బాజిరెడ్డి తీరు భేష్..


వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఎస్.ఐ బాజిరెడ్డి గారికి అహ్వానం అందించారా...ముందు ఆయనను మన కార్యక్రమానికి అతిధిగా పిలవండి అనే మాట వింజమూరు మండల వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇదే ఆయన వింజమూరు మండల ప్రజల మనస్సులలో చూరగొన్న అభిమానం... వివరాలలోకి వెళితే గత యేడాది మే నెల 10 వ తేదీన వింజమూరు ఎస్.ఐ గా భాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుండి తనదైన శైలిలో మండల రక్షణ వలయాధికారిగా న్యాయం విషయంలో పదిమందికీ మంచి చేస్తూ పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి చేర్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సహజంగా ఆయన ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలవడంతో పాటు 'గారు ' అని సంభోదించడం గొప్ప విషయం. ఎస్.ఐ బాజిరెడ్డి వింజమూరులో భాధ్యతలు చేపట్టిన తరువాత కాలంలో అప్పటికే మిస్టరీగా మారి ఉన్న బర్రెల దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని కటకటాల పాలు చేశారు. తదుపరి అత్యంత భయంకరమైన తూర్పు గోదావరిజిల్లాలోని గోకవరానికి చెందిన బరితెగింపు నేరస్థుల ఆటను సాహసోపేతంగా రక్తి కట్టించారు. అంతేగాక వింజమూరు బి.సి కాలనీకి చెందిన బాలుడి కిడ్నాప్ కేసును త్వరితగతిన చేధించి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయడంతొ పాటు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తే చట్టం ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్నేళ్ళ నుండి వ్యవసాయ పొలాలలో రైతులకు చెందిన మోటార్లను యధేచ్చగా దొంగిలిస్తూ తమ కార్యకలాపాలను సాగిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకుని తమ జీవితంలో ఇక ఎన్నడూ తప్పులు చేయబోమని వారి చేత ప్రతిజ్ఞలు చేయించి మార్పు తేవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి రైతులకు కీడు చేస్తున్న వారి ఆటలకు చరమగీతం పాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సెల్ ఫోన్ లలో మహిళలను వేధిస్తున్న ఆకతాయికి సరైన గుణపాఠం నేర్పారు.  ప్రతినిత్యం తన విధి నిర్వహణలో భాగంగా మీ రక్షణ కోసం మేమున్నాం...సమాజంలో శాంతిభధ్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖకు సహకరించండి అంటూ ఎస్.ఐ బాజిరెడ్డి చేస్తున్న విన్నపాలును ప్రజలందరూ పాటిస్తున్నారనే సంకేతాలను వింజమూరు మండలంలో బలంగా ప్రజలలో నాటుకుపోయే విధంగా కృషి చేశారని చెప్పవచ్చు. తాజాగా ఇటీవల మండలంలోని చౌటపల్లి గ్రామంలో దారుణహత్యకు గురైన మేడిపల్లి.వెంగళరావు హత్యను ఫిర్యాదు అందిన 24 గంటల లోపే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని వెంగళరావు మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు నిందితుల ఆచూకీని స్వల్ప వ్యవధిలోనే కనిపెట్టిన ఘనతను ఎస్.ఐ బాజిరెడ్డి చాటుకున్నారు. అంతేగాక ప్రస్తుత కరోనా కాలంలో ఆయన కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా తన సిబ్బందితో ప్రజల శ్రేయస్సు కోసం రాత్రింబవళ్ళు రోడ్లుపై పడిగాపులు కాసి వింజమూరు మండల ప్రజల మనసులలో సుస్థిర స్థానమును సంపాదించుకున్నారు.