వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలకు రెక్కలు... మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు,...

*వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలకు రెక్కలు... మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు,... వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని మద్యం షాపుల వద్ద లాక్ డౌన్ నిబంధనలకు మందుబాబులు తూట్లు పొడిచారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. ప్రస్తుత కరోనా వైరస్ సమయంలో లాక్ డౌన్ నియమ నిబందనలు అమలులో ఉండగా గ్రీన్ జోన్లులో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతులివ్వడం జరిగింది. అయితే మద్యం షాపుల వద్ద నిబంధనలు తూచ తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ ప్రభుత్వ ఆదేశాలు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాలేదు.  ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలు తీస్తారని 10 గంటల నుండే మందుబాబులు మద్యం దుకాణాల పరిసరాలలో గుంపులు గుంపులుగా చేరిపోయారు. మాస్కులు ధరించిన పాపాన పోలేదు. 11:30 గంటలకు మద్యం షాపులు తీయడంతో మద్యం ప్రియులు ఎగబడ్డారు. పలు చోట్ల క్యూ పద్దతి ఉన్నా సమదూరం పాటించలేదు. మరికొన్ని చోట్ల విచ్చలవిడిగా కౌంటర్ల వద్ద గుమికూడారు. ఆదివారం నాటి వరకు లాక్ డౌన్ నిబంధనలు ఒక ఎత్తు కాగా  సోమవారం మాత్రం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మద్యం ప్రియులు ద్విచక్ర వాహనాలలో ఇద్దరు ముగ్గురు వెళుతూ హల్ చల్ చేయడం కనిపించింది. ప్రస్తుతం ఉన్న ధరలపై 25 శాతం అదనంగా రెట్లు పెంచగా అంతకంటే ఎక్కువ నగదును మద్యం షాపుల నిర్వాహకులు వసూలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎస్.ఐ బాజిరెడ్డి ఒక కేసు దర్యాప్తు విషయంలో బిజీ బిజీగా ఉండటంతో మద్యం షాపుల వద్ద ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతులివ్వడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజలకు జీవన స్థితిగతులకు ఆసరాగా నిలిచే దుకాణాలను మూసివేయించి కుటుంబాల ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే మద్యం దుకాణాలకు  అనుమతులివ్వడం ఏంటని సర్వత్రా ప్రజలు ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తి పోశారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
స‌మాజ చైత‌న్య‌మే మ‌న ఆయుధం కావాలి... * ఎస్‌జెఆర్‌వో తొలి రాష్ట్ర స్థాయి స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపు విజ‌య‌వాడ‌: నిత్య జీవితంలో ప్ర‌జ‌లు ఎదు‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం సంస్థ స‌భ్యులంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని సోష‌ల్ జ‌స్టిస్ రైట్ ఫ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌జెఆర్‌వో) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపునిచ్చారు. ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ స‌మావేశాన్ని శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జ‌‌క్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థల్లో ‌జ‌రుగుతున్న అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం కార‌ణంగా న‌ష్ట‌పోతున్న పౌరుల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సామాజిక బాధ్య‌త‌గా భావించి సంస్థ స‌భ్యులు ప‌నిచేయాల‌ని కోరారు. స‌మాజంలో మార్పు రావాల‌ని కోరుకునే ప్ర‌తి వ్య‌క్తిని గుర్తించి వారితో క‌లిసి ప‌నిచేయ‌డం సంస్థ ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని పేర్కొన్నారు. స‌మాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, త‌గ్గిపోతున్న నైతిక విలువ‌లు, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో వ‌స్తున్న మార్పులు వంటి అంశాల‌పై స‌భ్యులు నిరంత‌రం గుర్తుచేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సామాన్య పౌరుల‌ను క‌లుపుకుని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా వారి ప‌రిష్కారం సులువవు‌తుంద‌న్నారు. 7 ద‌శాబ్ధాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా ప‌నిచేసిన స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‌జాతిపిత మ‌హాత్మా‌గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించి అనంత‌రం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా సంస్థ స‌భ్యుల‌కు గుర్తింపు కార్డులు అంద‌జేసి సంస్థ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తామ‌ని ప్ర‌మాణం చేయించారు. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం గ్రో గ్రీన్‌, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి మ‌నిషిలా జీవించాల‌ని కోరారు. స‌మావేశానికి ఎస్‌జెఆర్‌వో మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాస‌రి ధాత్రి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా కృష్ణా జిల్లా అధ్య‌క్ష‌, ప్రధాన కార్య‌ద‌ర్శులు చెన్నాప్ర‌గ‌ఢ ప్ర‌సాద్‌, కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌, మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు కె.భాగ్య‌ల‌క్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.