800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

*గూడూరు మండలం* : *కొమ్మనేటూరు* *పంచాయతి నందు 800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు


 *తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు* *నాయుడు  ఆదేశాల మేరకు* ...  


*గూడూరు మండలం* : కొమ్మనేటూరు పంచాయతి లోని కొమ్మనేటూరు, రెడ్డిగుంట,తిరువెంగలాయపల్లి, తిరుపతిగారి పల్లి గ్రామాల నందు నివసిస్తున్న 800 కుటుంభాలకు కుటుంబానికి 5 కోడి గుడ్డులు మరియు కూరగాయలను పంపిణి చేసిన... 


 *మాజీ శాసనసభ్యులు మరియు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్* *వర్యులు*  పాశిం.సునీల్ కుమార్* 


అనoతరం మీడియాతో మాట్లాడుతూ... 


⭐కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఎదుర్కోనుచున్న ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
 
⭐ఈ కరోనా లాక్ డౌన్ వలన కూలి పనులు లేక గ్రామాలు యందు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పేదలకు ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
   
⭐ఈ కరోనా లాక్ డౌన్ లో మద్యం షాపులు లేనందువలన ప్రతి కుటుంభం ఉన్నంతలో తిని కుటుంభ సభ్యులతో గడిపారు. కాని రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరవడంతో కుటుంభ పోషణ కొరకు దాచుకున్న డబ్బులను తీసుకెళ్ళి తాగుతున్నారని, దీని వలన కుటుంభంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు.


⭐ప్రస్తుతం సంపాదన లేదు కాబట్టి , ఉన్నదానిలోనే పొదుపుగా వాడుకుంటూ కుటుంభసభ్యులతో కలసి ఇంటిలో ఉండి కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండాలని, చేతులను 20 నిముషాల పాటు సబ్బుతో శుబ్రపరుచుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, మండల పార్టీ అద్యక్షులు కొండూరు.వెంకటేశ్వరరాజు, మండల నాయకులు నెలటూరు.భాస్కర్ రెడ్డి, మధురెడ్డి, BC సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, MPTC అభ్యర్ధి మాతంగి.వెంకటయ్య, నాయకులు కాపులూరు.బాలకృష్ణా రెడ్డి, చుట్టి.వీర రాఘవులు, ఈతమొక్కల.పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.