లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వికలాంగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి  -

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వికలాంగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి  - ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సి నాగరాజు డిమాండ్ 
ఎమ్మిగనూరు,మే,11 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని  సోమవారం ఉదయం 11 గంటలప్రాంతంలో  ఎమ్మిగనూరు తాలూకా వికలాంగుల సంక్షేమ హక్కుల సాధన సమితి  అధ్యక్షులు K. రామాంజనేయులు, ఆర్గనైజింగ్ B. C. నాగరాజులు విలేకరులతో మాట్లాడుతూ గత రెండు మాసాలుగా కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇటు వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న, స్వయం ఉపాధి చేసుకుని జీవిస్తున్న ఎంతోమంది మా వికలాంగులు రోడ్డున పడ్డారనివారు తెలిపారు. కాబట్టి వీరి,వీరి కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందనివారు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని పెన్షన్ తో, సమాజంలో ఎటువంటి ఆర్థిక, సహాయ, సహకారాలు అందక పూట గడవడమే కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వికలాంగులే కకావికలం అవుతున్న తరుణంలో మా వికలాంగులు ఇంకెంత నిస్సహాయ, దయానియ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభుత్వం, పాలక పక్షకులు అర్థం చేసుకోవాలనివారు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వికలాంగులకు ఇచ్చే పింఛన్ను కాక ప్రతి వికలాంగునికి 10వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం, 4నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల భత్యాన్ని వెంటనే ఇచ్చే  ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేకపోతే  వికలాంగులంతా త్వరలోనే  కలెక్టరేట్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి టైలర్ సాయిబన్న, పెద్దయ్య, రాజశేఖర్, నర్సింహులు, రఘు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు