ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కి కన్నా లక్ష్మీనారాయణ లేఖ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ .    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కి లేఖ రాశారు..


లేఖలోని ప్రధానమైన అంశాలు..


కరోనా మహమ్మారి విపత్తు కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు,విద్యార్థులు,పర్యాటకులు మరియు ఇతర ప్రజానీకం ప్రయాణ వెసులుబాటు లేక వివిధ రాష్ట్రాలలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.


ముఖ్యంగా వీరిలో అత్యధికంగా వలస కార్మికులు ఉన్నారు.లాక్-డౌన్ కారణంగా వ్యాపార లావాదేవీలు,భవన నిర్మాణాలు మొదలైన రంగాలలో ఉపాధి అవకాశాలు నిలచి పోవడంతో వారు వారి స్వస్థలాలకు చేరుకోవాలని ఆందోళనతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఒంటరిగా ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యల పరిష్కరించడానికి కొన్ని సలహాలు సూచనలు ఇప్పటికే మార్గదర్శనం చేసింది.


మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నోడల్ ఆఫీసర్స్ నంబర్లు లక్షలాది బాధితులు సరిపోయే అవకాశం లేక పోగా వారి సహాయం కోసం చేసే ప్రయత్నం విఫలం చెందే అవకాశం ఉంది.


కావున భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాను.ముఖ్యంగా


1. బాధితుల సమస్యల పరిష్కారించడానికి రాష్ట్ర స్థాయిలో 10 నుంచి 12 హెల్ప్-లైన్లు ఏర్పాటు చేసి మల్టీ-లైన్ల సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.


2. జిల్లా స్థాయిలో 10 నుంచి 12 హెల్ప్-లైన్లు ఏర్పాటు చేసి మల్టీ-లైన్ల సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వర్గాల బాధితులకు సత్వరం సహాయం అందుతుంది.


పైన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


                బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,
                కన్నా లక్ష్మీనారాయణ.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు