AP COVID 19 COMMAND CONTROL ***************************** కార్యాలయాల్లో పనిచేయు ఉద్యోగులు కోవిడ్19 నుండి తమను తాము రక్షించుకుంటూ సురక్షితముగా తమ విధులు నిర్వహించుకొనుటకు గాను సూచించబడిన కార్యాలయ ఏర్పాట్లు మరియు నివారణ చర్యల మార్గదర్శకాలు. నేపధ్యము కార్యాలయాలు మరియు పనిచేయు ప్రదేశాల లో కారిడార్లు, ఎలివేటర్లు & మెట్లు, పార్కింగ్ స్థలాలు, ఫలహార శాల, సమావేశ గదులు మరియు సమావేశ మందిరాలు మొదలైన సౌకర్యాలు చాలా వరకూ ఒకే విధంగా ఉంటాయి. ఉద్యోగులు ఉమ్మడిగా ఉపయోగించుకునే ఇటు వంటి సౌకర్యాల ప్రదేశాల వల్ల అధికారులు, సిబ్బంది మరియు సందర్శకులలో కోవిడ్19 చాలా వేగంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. కార్యాలయాలలో పనిచేయు సిబ్బంది కోవిడ్19 బారి నుండి తమను తాము రక్షించుకుంటూనే తమ విధులను సురక్షితముగా నిర్వహించుకొనుటకు గాను కార్యాలయాలలో చేయవలసిన మార్పులు చేర్పులు మరియు పాటించవలసిన ప్రామాణిక మార్గదర్శక నియమాల గురించి ఈ కింది సూచించిన విధంగా విభాగాలుగా విభజించి అమలు చేయబడుతుంది. అన్ని సమయాల్లో అందరూ పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయాలలో కోవిడ్19 నిరోధించుటకు గాను చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు కార్యాలయ సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురయినపుడు తీసుకోనవలసిన చర్యలు. కార్యాలయ సిబ్బంది కోవిడ్19 అనుమానితుడిగా లేదా ధృవీకరించబడిన వ్యక్తిగా నిర్ధారించ బడినపుడు చేపట్టవలసిన క్రిమి సంహారక చర్యలు. పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయం లో COVID-19 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన ప్రాథమిక నివారణ మరియు సాధారణ ప్రజారోగ్య ఈ చర్యలను ఉద్యోగులు మరియు సందర్శకులు అన్ని సమయాల్లో పాటించాలి. మరియు వీటితో పాటు ఈ కింద సూచించబడిన రక్షణ విధానాలు ఖచ్చితముగా పాటించాలని కొరడమైనది. అన్నీ సందర్బాలలో సిబ్బందికి మరియు సందర్శకుల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. కార్యాలయ పని వేళల్లో సిబ్బంది మొహానికి ఫేస్ కవర్లు మరియు మాస్కు లు వాడడం తప్పని సరి. చేతులను తరచుగా కనీసం 20 సెకండ్ల పాటు ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ ద్వారా గాని లేదా 40 నుండి 60 సెకండ్ల పాటు సబ్బు నీటితో కడగడం చేయాలి. శ్వాస కోశ సంబంధ మర్యాదలు సూచించిన విధంగా ఖచ్చితముగా అలవాటు చేసుకోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టు కోవడం లేదా టిస్యూ పేపర్ వాడడం లేదా ముక్కు నోరుని ఆ సమయం లో మోచేతిని అడ్డు పెట్టుకోవడం ద్వారా కవర్ చేసుకోవడం తో పాటు ఉపయోగించిన టిస్యూ పేపర్ ని సరైన రీతిలో పారవేయాలి. సిబ్బంది తమ ఆరోగ్య లక్షణాల గురించి తామే అనుక్షణం గమనించుకుంటూ ఏదేనా అనుమానిత లక్షణాలు గమనించినపుడు వెంటనే స్పందించి తగిన చికిత్స తీసుకోవాలి. *కార్యాలయాలలో కోవిడ్19 నివారణకు చేపట్టవలసిన చర్యలు.* కార్యాలయాల లో కోవిడ్19 నివారణ చర్యలకు సంబంధించి అనుసరించవలసిన మార్గదర్శకాలను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ద్వారా జారీ చేయబడ్డాయి. ఏ సిబ్బంది అయినా ఫ్లూ వంటి అనారోగ్యానికి గురయినపుడు కార్యాలయానికి హాజరు కాకూడదు. సిఎస్ (ఎంఏ) వైద్య హాజరు కింద స్థానిక CGHS ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆ సెంటర్ యొక్క ఆరోగ్య అధికారుల నుండి వైద్య సలహా తీసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి కోవిడ్19 యొక్క అనుమానితుడు లేదా ధృవీకరించబడిన వ్యక్తి గా నిర్ధారణ అయినట్లయితే ఆ సమాచారం ను వెంటనే కార్యాలయ అధికారులకు తెలియజేయాలి. ఉద్యోగి తన నివాస ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్ కార్యకలాపాలు అమలుపరచడం వలన కార్యాలయానికి హాజరు కాలేని సందర్భం లో ఇంటి నిర్బంధాన్ని అభ్యర్థించే ఏ సిబ్బంది అయినా ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలి. సమావేశాలను నిర్వహించడానికి సంబంధించి సందర్శకులను సమన్వయం చేయడం అనేది డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా జాగ్రత్తగా అమలు చేయబడతాయి. *కార్యాలయం లో సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురైనపుడు తీసుకోవాల్సిన చర్యలు.* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో కోవిడ్19 ప్రభావానికి గురయ్యే అవకాశాలు సంభవించడాన్ని తోసిపుచ్చలేము. అటువంటి పరిస్థితులలో *ఈ క్రింది చర్యలు తీసుకోబడతాయి.* 5.1. ఒకే గది లో లేదా కార్యాలయం లో చాలా దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కోవిడ్19 సూచించే లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించినప్పుడు. 5.1.1. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కార్యాలయంలో ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల నుండి వేరుచేసి వేరే గదిలో లేదా వేరే ప్రదేశంలో ఉంచండి. అతను / ఆమె ను ఒక వైద్యుడు వచ్చి పరీక్షించే వరకు అతను / ఆమె కు ముసుగు లేదా మాస్క్ ఇవ్వండి. 5.1.2. సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య అధికారులకు తెలియపరచాలి. మరియు హెల్ప్ లైన్ 1075 కు వెంటనే సమాచారం ఇవ్వాలి. 5.1.3. నియమించబడిన ప్రజారోగ్య అధికారం లేదా జిల్లా RRT / చికిత్స చేసే వైద్యుడు చేత వైరస్ తీవ్రత అంచనా వేయబడుతుంది మరియు తదనుగుణంగా కేసు నిర్వహణ, అతని / ఆమె పరిచయాలు మరియు చేపట్టవలసిన క్రిమిసంహారక చర్యల గురించి మరిన్ని సలహాలు ఇవ్వబడతాయి. 5.1.4. ఆరోగ్య అధికారుల అంచనాలు అనుసరించి సదరు వ్యక్తిలో చాలా తేలికపాటి లేదా తేలికపాటి లక్షణాలను గుర్తించినట్లయితే సదరు వ్యక్తి హోమ్ ఐసోలేషన్ లో ఉంచబడతాడు, ఇది వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడ్డ మార్గదర్శకాల ప్రమాణాలు కు లోబడి ఉంటుంది. సదరు మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి 5,1,5, ఆరోగ్య అధికారులు అనుమానిత కేసు మితమైన మరియు తీవ్రమై నదిగా అంచనా వేస్తే, అతను / ఆమె విషయం లో ప్రభుత్వ సూచనలను పాటిస్తారు 5.1.6. ప్రభావిత వ్యక్తి యొక్క పరిచయాల జాబితాను తయారు చేయుటకు గాను సంబంధిత జిల్లా యొక్క ర్యాపిడ్ యాక్షన్ టీం కు తెలియచేయ బడి అభ్యర్థించడం జరుగుతుంది. 5.1.7. రోగి యొక్క నివేదిక కోవిడ్19 గా గుర్తించబడిన తర్వాత అతని యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు పని ప్రదేశం ని క్రిమి సంహారకం చేయడము కోసం అవసరమైన చర్యలు ప్రారంభమవుతాయి. **5.2. ప్రీ-సింప్టోమాటిక్ /* అసింప్టోమాటిక్ కేసు నుండి పెద్ద సంఖ్యలో పరిచయాలు ఉంటే, కార్యాలయ పరిధిలో క్లస్టర్ ఉద్భవించే అవకాశం ఉంది. కార్యాలయములో ఇరుకైన పని ప్రదేశ కారణంగా ఇది పెద్ద క్లస్టర్ గా మార్పుచెందవచ్చు .(>15కేసులుకంటేఎక్కువ). రిస్క్ అసెస్మెంట్, ఐసోలేషన్ మరియు పరియాల నిర్బంధం, కేస్ రిఫెరల్ మరియు మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన సూత్రాలు అలాగే ఉంటాయి.అయితే వీటి ఏర్పాట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది *5.3. పరిచయాల నిర్వహణ* . అధిక రిస్క్ ఎక్స్పొజర్ పరిచయాలు 14 రోజులు పాటు నిర్బంధించబడతాయి. వారు ఇంటి దిగ్బంధంపై సూచించిన మార్గదర్శకాలను పాటిస్తారు. ఈ వ్యక్తులు ICMR ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష చేయించుకోవాలి తక్కువ రిస్క్ ఎక్స్పోజర్ గురయిన వ్యక్తులు పని చేస్తూనే ఉంటారు మరియు వారిని వచ్చే 14 రోజులు పాటు వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కార్యాలయాన్ని మూసివేయడం కార్యాలయం లో ఒకటి లేదా రెండు కేసులు గుర్తించబడితే గత 48 గంటల్లో రోగి సందర్శించిన ప్రదేశాలు / ప్రాంతాలకు క్రిమిసంహారక ప్రక్రియ పరిమితం చేయబడుతుంది.కార్యాలయం యొక్క ఇతర ప్రాంతాలలో లేదా మొత్తం కార్యాలయ భవనం లో పనిని నిలిపి వేయవలసిన అవసరం లేదు మరియు నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం క్రిమిసంహారక చర్య నిర్వహించిన తర్వాత పనిని తిరిగి ప్రారంభించవచ్చు ఒకవేళ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాబడితే పూర్తి క్రిమిసంహారక చర్యలు చేపట్టిన తర్వాత భవనం మొత్తం 48 గంటలు పాటు మూసి వేయవలసి ఉంటుంది. భవనం పూర్తి క్రిమిసంహారకమై తిరిగి వినియోగించుటకు తగినట్టుగా ప్రకటించే వరకు సిబ్బంది అందరూ ఇంటి వద్ద నుండే పని చేయవలసి ఉంటుంది. ___________________________ డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్/Covid19
Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
• Valluru Prasad Kumar
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
• Valluru Prasad Kumar
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్
• Valluru Prasad Kumar
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల
• Valluru Prasad Kumar
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn