AP COVID 19 COMMAND CONTROL ***************************** కార్యాలయాల్లో పనిచేయు ఉద్యోగులు కోవిడ్19 నుండి తమను తాము రక్షించుకుంటూ సురక్షితముగా తమ విధులు నిర్వహించుకొనుటకు గాను సూచించబడిన కార్యాలయ ఏర్పాట్లు మరియు నివారణ చర్యల మార్గదర్శకాలు. నేపధ్యము కార్యాలయాలు మరియు పనిచేయు ప్రదేశాల లో కారిడార్లు, ఎలివేటర్లు & మెట్లు, పార్కింగ్ స్థలాలు, ఫలహార శాల, సమావేశ గదులు మరియు సమావేశ మందిరాలు మొదలైన సౌకర్యాలు చాలా వరకూ ఒకే విధంగా ఉంటాయి. ఉద్యోగులు ఉమ్మడిగా ఉపయోగించుకునే ఇటు వంటి సౌకర్యాల ప్రదేశాల వల్ల అధికారులు, సిబ్బంది మరియు సందర్శకులలో కోవిడ్19 చాలా వేగంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. కార్యాలయాలలో పనిచేయు సిబ్బంది కోవిడ్19 బారి నుండి తమను తాము రక్షించుకుంటూనే తమ విధులను సురక్షితముగా నిర్వహించుకొనుటకు గాను కార్యాలయాలలో చేయవలసిన మార్పులు చేర్పులు మరియు పాటించవలసిన ప్రామాణిక మార్గదర్శక నియమాల గురించి ఈ కింది సూచించిన విధంగా విభాగాలుగా విభజించి అమలు చేయబడుతుంది. అన్ని సమయాల్లో అందరూ పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయాలలో కోవిడ్19 నిరోధించుటకు గాను చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు కార్యాలయ సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురయినపుడు తీసుకోనవలసిన చర్యలు. కార్యాలయ సిబ్బంది కోవిడ్19 అనుమానితుడిగా లేదా ధృవీకరించబడిన వ్యక్తిగా నిర్ధారించ బడినపుడు చేపట్టవలసిన క్రిమి సంహారక చర్యలు. పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయం లో COVID-19 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన ప్రాథమిక నివారణ మరియు సాధారణ ప్రజారోగ్య ఈ చర్యలను ఉద్యోగులు మరియు సందర్శకులు అన్ని సమయాల్లో పాటించాలి. మరియు వీటితో పాటు ఈ కింద సూచించబడిన రక్షణ విధానాలు ఖచ్చితముగా పాటించాలని కొరడమైనది. అన్నీ సందర్బాలలో సిబ్బందికి మరియు సందర్శకుల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. కార్యాలయ పని వేళల్లో సిబ్బంది మొహానికి ఫేస్ కవర్లు మరియు మాస్కు లు వాడడం తప్పని సరి. చేతులను తరచుగా కనీసం 20 సెకండ్ల పాటు ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ ద్వారా గాని లేదా 40 నుండి 60 సెకండ్ల పాటు సబ్బు నీటితో కడగడం చేయాలి. శ్వాస కోశ సంబంధ మర్యాదలు సూచించిన విధంగా ఖచ్చితముగా అలవాటు చేసుకోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టు కోవడం లేదా టిస్యూ పేపర్ వాడడం లేదా ముక్కు నోరుని ఆ సమయం లో మోచేతిని అడ్డు పెట్టుకోవడం ద్వారా కవర్ చేసుకోవడం తో పాటు ఉపయోగించిన టిస్యూ పేపర్ ని సరైన రీతిలో పారవేయాలి. సిబ్బంది తమ ఆరోగ్య లక్షణాల గురించి తామే అనుక్షణం గమనించుకుంటూ ఏదేనా అనుమానిత లక్షణాలు గమనించినపుడు వెంటనే స్పందించి తగిన చికిత్స తీసుకోవాలి. *కార్యాలయాలలో కోవిడ్19 నివారణకు చేపట్టవలసిన చర్యలు.* కార్యాలయాల లో కోవిడ్19 నివారణ చర్యలకు సంబంధించి అనుసరించవలసిన మార్గదర్శకాలను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ద్వారా జారీ చేయబడ్డాయి. ఏ సిబ్బంది అయినా ఫ్లూ వంటి అనారోగ్యానికి గురయినపుడు కార్యాలయానికి హాజరు కాకూడదు. సిఎస్ (ఎంఏ) వైద్య హాజరు కింద స్థానిక CGHS ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆ సెంటర్ యొక్క ఆరోగ్య అధికారుల నుండి వైద్య సలహా తీసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి కోవిడ్19 యొక్క అనుమానితుడు లేదా ధృవీకరించబడిన వ్యక్తి గా నిర్ధారణ అయినట్లయితే ఆ సమాచారం ను వెంటనే కార్యాలయ అధికారులకు తెలియజేయాలి. ఉద్యోగి తన నివాస ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్ కార్యకలాపాలు అమలుపరచడం వలన కార్యాలయానికి హాజరు కాలేని సందర్భం లో ఇంటి నిర్బంధాన్ని అభ్యర్థించే ఏ సిబ్బంది అయినా ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలి. సమావేశాలను నిర్వహించడానికి సంబంధించి సందర్శకులను సమన్వయం చేయడం అనేది డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా జాగ్రత్తగా అమలు చేయబడతాయి. *కార్యాలయం లో సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురైనపుడు తీసుకోవాల్సిన చర్యలు.* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో కోవిడ్19 ప్రభావానికి గురయ్యే అవకాశాలు సంభవించడాన్ని తోసిపుచ్చలేము. అటువంటి పరిస్థితులలో *ఈ క్రింది చర్యలు తీసుకోబడతాయి.* 5.1. ఒకే గది లో లేదా కార్యాలయం లో చాలా దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కోవిడ్19 సూచించే లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించినప్పుడు. 5.1.1. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కార్యాలయంలో ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల నుండి వేరుచేసి వేరే గదిలో లేదా వేరే ప్రదేశంలో ఉంచండి. అతను / ఆమె ను ఒక వైద్యుడు వచ్చి పరీక్షించే వరకు అతను / ఆమె కు ముసుగు లేదా మాస్క్ ఇవ్వండి. 5.1.2. సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య అధికారులకు తెలియపరచాలి. మరియు హెల్ప్ లైన్ 1075 కు వెంటనే సమాచారం ఇవ్వాలి. 5.1.3. నియమించబడిన ప్రజారోగ్య అధికారం లేదా జిల్లా RRT / చికిత్స చేసే వైద్యుడు చేత వైరస్ తీవ్రత అంచనా వేయబడుతుంది మరియు తదనుగుణంగా కేసు నిర్వహణ, అతని / ఆమె పరిచయాలు మరియు చేపట్టవలసిన క్రిమిసంహారక చర్యల గురించి మరిన్ని సలహాలు ఇవ్వబడతాయి. 5.1.4. ఆరోగ్య అధికారుల అంచనాలు అనుసరించి సదరు వ్యక్తిలో చాలా తేలికపాటి లేదా తేలికపాటి లక్షణాలను గుర్తించినట్లయితే సదరు వ్యక్తి హోమ్ ఐసోలేషన్ లో ఉంచబడతాడు, ఇది వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడ్డ మార్గదర్శకాల ప్రమాణాలు కు లోబడి ఉంటుంది. సదరు మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి 5,1,5, ఆరోగ్య అధికారులు అనుమానిత కేసు మితమైన మరియు తీవ్రమై నదిగా అంచనా వేస్తే, అతను / ఆమె విషయం లో ప్రభుత్వ సూచనలను పాటిస్తారు 5.1.6. ప్రభావిత వ్యక్తి యొక్క పరిచయాల జాబితాను తయారు చేయుటకు గాను సంబంధిత జిల్లా యొక్క ర్యాపిడ్ యాక్షన్ టీం కు తెలియచేయ బడి అభ్యర్థించడం జరుగుతుంది. 5.1.7. రోగి యొక్క నివేదిక కోవిడ్19 గా గుర్తించబడిన తర్వాత అతని యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు పని ప్రదేశం ని క్రిమి సంహారకం చేయడము కోసం అవసరమైన చర్యలు ప్రారంభమవుతాయి. **5.2. ప్రీ-సింప్టోమాటిక్ /* అసింప్టోమాటిక్ కేసు నుండి పెద్ద సంఖ్యలో పరిచయాలు ఉంటే, కార్యాలయ పరిధిలో క్లస్టర్ ఉద్భవించే అవకాశం ఉంది. కార్యాలయములో ఇరుకైన పని ప్రదేశ కారణంగా ఇది పెద్ద క్లస్టర్ గా మార్పుచెందవచ్చు .(>15కేసులుకంటేఎక్కువ). రిస్క్ అసెస్మెంట్, ఐసోలేషన్ మరియు పరియాల నిర్బంధం, కేస్ రిఫెరల్ మరియు మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన సూత్రాలు అలాగే ఉంటాయి.అయితే వీటి ఏర్పాట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది *5.3. పరిచయాల నిర్వహణ* . అధిక రిస్క్ ఎక్స్పొజర్ పరిచయాలు 14 రోజులు పాటు నిర్బంధించబడతాయి. వారు ఇంటి దిగ్బంధంపై సూచించిన మార్గదర్శకాలను పాటిస్తారు. ఈ వ్యక్తులు ICMR ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష చేయించుకోవాలి తక్కువ రిస్క్ ఎక్స్పోజర్ గురయిన వ్యక్తులు పని చేస్తూనే ఉంటారు మరియు వారిని వచ్చే 14 రోజులు పాటు వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కార్యాలయాన్ని మూసివేయడం కార్యాలయం లో ఒకటి లేదా రెండు కేసులు గుర్తించబడితే గత 48 గంటల్లో రోగి సందర్శించిన ప్రదేశాలు / ప్రాంతాలకు క్రిమిసంహారక ప్రక్రియ పరిమితం చేయబడుతుంది.కార్యాలయం యొక్క ఇతర ప్రాంతాలలో లేదా మొత్తం కార్యాలయ భవనం లో పనిని నిలిపి వేయవలసిన అవసరం లేదు మరియు నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం క్రిమిసంహారక చర్య నిర్వహించిన తర్వాత పనిని తిరిగి ప్రారంభించవచ్చు ఒకవేళ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాబడితే పూర్తి క్రిమిసంహారక చర్యలు చేపట్టిన తర్వాత భవనం మొత్తం 48 గంటలు పాటు మూసి వేయవలసి ఉంటుంది. భవనం పూర్తి క్రిమిసంహారకమై తిరిగి వినియోగించుటకు తగినట్టుగా ప్రకటించే వరకు సిబ్బంది అందరూ ఇంటి వద్ద నుండే పని చేయవలసి ఉంటుంది. ___________________________ డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్/Covid19
Popular posts
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
• Valluru Prasad Kumar
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
• Valluru Prasad Kumar
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn