కరోనా పాజిటివ్ వ్యక్తి ఇంటికి హైపో క్లోరైట్ స్ప్రే చేసిన : ఎమ్మెల్యే చెవిరెడ్డి..

కరోనా పాజిటివ్ వ్యక్తి ఇంటికి హైపో క్లోరైట్ స్ప్రే చేసిన : ఎమ్మెల్యే చెవిరెడ్డి..
* అధికార యంత్రాంగంతో అప్రమత్తం చర్యలు
* అదైర్య పడొద్దని ప్రభుత్వ సిబ్బందికి భరోసా
* స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు సూచన


తిరుపతి, 


కరోనా పాజిటివ్ కేసు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ కాలనీలో నమోదైందని తెలుసుకొన్న ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంటనే స్పందించారు. అధికార యంత్రాంగంతో కలిసి శుక్రవారం హుటాహుటిన కరోనా వచ్చిన వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటికి చెవిరెడ్డి గారు స్వయంగా హైపో క్లోరైట్ పిచికారీ ని స్ప్రే చేశారు. అనంతరం పరిసర ప్రాంతాలలో పిచికారీ స్ప్రే చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసు నమోదుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల చర్యలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెరుగైన సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. బాధ్యత కలిగిన శాసన సభ్యుడిగా నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానని స్పష్టం చేశారు.  కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఐశులేషన్ లో చికిత్స పొంది సాధారణ వ్యక్తులుగా తిరిగి వస్తున్న సందర్భాలను గుర్తు చేస్తూ ప్రజల్లో దైర్యం నింపారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం అధైర్య పడకుండా అవకాశంగా భావించాలని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తిరుపతి రూరల్ ఎంపీడీవో సుశీల దేవి, తహశీల్దార్ కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు