ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సాఫ్టువేర్ ఉద్యోగి   D.పవన్ కుమార్ రెడ్డి  సహాయ సహకారాలతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సాఫ్టువేర్ ఉద్యోగి   D.పవన్ కుమార్ రెడ్డి  సహాయ సహకారాలతో ఈరోజు 09.05.2020వ గూడూరు మండలం లోని పురిటిపాలెం గిరిజన కాలనీ లోని 35 పేద  కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిధి సేవాభావం కలిగిన వ్యక్తి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ఎం. మస్తానయ్య, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా, ఆలీ,C V.R న్యూస్ సతీష్, జాలేంద్ర, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.