ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతి మే 15 (అంతిమ తీర్పు) :


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.


అమరావతి రాజధాని ఉద్యమం నేటికి 150 వ రోజుకు చేరింది.


లాఠీలు ఝళిపించినా, అక్రమంగా కేసులు బనాయించినా, అరెస్టులు చేసి జైళ్ళకు పంపినా ఉద్యమం నేటి వరకు శాంతియుతంగానే సాగింది.


మూడు రాజధానులంటూ అమరావతి నుండి రాజధానిని  విశాఖ తరలించే ప్రయత్నం చేశారు.


విశాఖలో ఎల్జి పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటనతో మీకు మద్దతిచ్చేవారు కూడా ఆలోచనలో పడ్డారు.


ఇప్పటికైనా మూడు రాజధానుల మాట విరమించుకొని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయండి.


మీరు తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుతున్నాయి. మీ మొండి వైఖరి విడనాడి పరిపాలనపై దృష్టి సారించండి.
- రామకృష్ణ.