నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ*

*నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ* వింజమూరు, మే 17, (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ఆదివారం నాడు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ మాంసం విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులకు పంచాయితీ సెక్రటరీ బంకా.శ్రీనివాసులు రెడ్డి 5 వేల రూపాయలను జరిమానాలుగా విధించారు. ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజుల వ్యవధిలో ఆదివారం దినములలో చికెన్, మటన్, చేపల విక్రయాలు జరపరాదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న విషయాలు అందరికీ తెలిసిందే. ఆదివారం సమయాలలో ఈ దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని, ఈ పరిణామాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణభూతాలవుతాయనే ఉద్దేశ్యంతో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. వింజమూరులోని బంగ్లాసెంటర్, షఫి హాస్పిటల్ వీధి, దేవతా మహల్ సెంటర్, గంగమిట్ట తదితర ప్రాంతాలలో మాంసం విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమని భావించిన అధికారులు ఆదివారాలలో మాంసం దుకాణాల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు ఈ అమ్మకాలపై నిషేదం విధించారు. కానీ కొంతమంది వ్యాపారులు రహస్య ప్రదేశాలలో మాంసం విక్రయాలకు నడుం బిగించారు. వీటిపై నిఘా ఉంచిన పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి ఆదివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తమ సిబ్బందితో పలు ప్రాంతాలలో సోదాలు చేసి నలుగురు మాంసం విక్రయదారులకు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అందరూ కంకణ బద్ధులై ఉండాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనల అంశాల విషయంలో ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image