టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి ; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని 

జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు... 
* ఆరోగ్యసేతు యాప్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి
* టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
అమరావతి: వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఎప్పటి కప్పుడు సందేశాలను ఇచ్చేందుకు వీలుగా జిఓ.సంఖ్య 257 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోందన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని దీనిపై ఇప్పటికే జి.ఓ.సంఖ్య. 254 ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు.కావున ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా చూడాలన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో  టెలీమెడిషన్ విధానం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.అంతేగాక టెలిమెడిషన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధితులకు మందులు అందేలా చూడాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో వైయస్సార్ క్లినిక్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రీన్ జోన్లలో వివిధ ఎంఎస్ఎంఇ యూనిట్లన్నీ ప్రారంభించి భౌతిక దూరాన్ని పాటించిస్తూ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈఎంఎస్ఎంఇలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిందని అనగా 2014-15 సంవత్సరాలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను క్లియర్ చేయడం జరుగు తుందని సిఎస్ పేర్కొన్నారు. అంతేగాక ఏప్రిల్ నుండి జూన్ వరకూ విద్యుత్ చార్జీల రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అలాగే వర్కింగ్ క్యాపిటల్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని సిఎస్ తెలిపారు.3వ దశ లాక్ డౌన్ సమీపిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా లాక్ డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న టెస్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. టెలి మెడిసిన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధిత పిహెచ్ సిరి ద్వారా మందులు పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. వీడియో సమావేశంలో కొవిడ్ కంట్రోల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image