టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం(13.05.2020)
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం బుధవారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆన్ లైన్ లో నిర్వహించారు.  పోలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను పోలిట్ బ్యూరో దృష్టికి తెచ్చారు. 
ప్రధాని శ్రీ నరేంద్రమోది రూ20లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  
‘‘కరోనా ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత’’ అనేవిధంగా ఇకపై ప్రపంచవ్యాప్త అధ్యయనాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవస్థతో పాటు జీవన విధానంలో పెనుమార్పులు. నిరుద్యోగం, ఆహార సమస్య, ఆర్ధిక వ్యవస్థ తలకిందులు, రైతులు దెబ్బతినడం, పరిశ్రమలు సిక్ కావడం, ఉపాధి కోల్పోవడం, అనేక సమస్యలు చుట్టుముట్టాయి. 
కరోనా నియంత్రణలో విఫలమైతే జరిగే నష్టం అపారం. ప్రజలను మానసికంగా సిద్దం చేయడం ముఖ్యం. పాలకులు అసమర్ధులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. 
దేశంలో ఇప్పుడు  లాక్ డౌన్ -4లోకి రాబోతున్నాం. లాక్ డౌన్ 1 నుంచి 4వరకు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా కేంద్రానికి( ప్రధాని, పిఎంవో, నీతిఅయోగ్ లకు) 5 లేఖలు రాశాం. 
బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పని చేస్తోంది, నిపుణులతో చర్చిస్తోంది, పబ్లిక్ పాలసీ రూపొందించి ప్రభుత్వాలకు పంపుతోంది. 
తెలుగుదేశం పార్టీ గత 4దశాబ్దాలుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోంది. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు పబ్లిక్ పాలసీలు రూపొందించడం, సమస్యల పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం చేశాం. వివిధ సందర్భాల్లో మనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు ఉపయోగపడ్డాం. ప్రధాని వాజ్ పేయి హయాంలో టిడిపి ఆధ్వర్యంలో వేసిన కమిటి సిఫారసులతో టెలి కమ్యూనికేషన్ల రంగంలో అభివృద్ది సాధ్యం అయ్యింది. ఇన్సూరెన్స్ పాలసీలలో మార్పులు వచ్చాయి. సూక్ష్మ సేద్యంపై వేసిన కమిటి సిఫారసులతో దేశవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ అభివృద్ధికి దోహదపడింది. దేశ వ్యాప్తంగా నదుల అనుసందానంపై చర్చకు నాంది పలికింది. డిమానిటైజేషన్ పై కమిటి సిఫారసులతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి.
టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే, గత ఏడాదిలోనే  వైసిపి ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసింది. కరెంటు బిల్లులు 4రెట్లు పెరిగాయని పేదలు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి, కర్బూజ, పుచ్చ తదితర పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 
అకాల వర్షాలతో రెండు రాష్ట్రాలలో  పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నవాళ్లు, దేశాలు-రాష్ట్రాలే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారు.
లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా ప్రధాని దేశాన్ని కట్టుబాటు చేయగలిగారు. లాక్ డౌన్ 2, లాక్ డౌన్ 3 అమలు చేశారు. అయితే నిబంధనల అమలులోనే కొన్ని రాష్ట్రాలలో పొరబాట్లు జరిగాయి. మద్యం దుకాణాలు తెరవడం తప్పిదంగా మారింది. జూన్, జులైలో కేసులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
కరోనా నియంత్రణలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా చేయలేక పోయారు. జోన్లుగా విభజించినా సక్రమంగా పర్యవేక్షించడంలో విఫలం అయ్యారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగింది. 
ఏపిలో మద్యం మూడిందాలా నష్టం చేసింది. నాసిరకం బ్రాండ్లతో ఆరోగ్యం దెబ్బతింది. ఆర్ధికంగా జేబులు గుల్ల చేశారు. గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసులు పెరిగాయని’’ చంద్రబాబు ఆవేదన చెందారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image