జగన్ రెడ్డి అవినీతికి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు  రెండు చక్రాలు : బుద్ధా వెంకన్న

తేది.03.05.2020
విలేకర్ల సమావేశం వివరాలు
మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం
జగన్ రెడ్డి అవినీతికి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు  రెండు చక్రాలు
బుద్ధా వెంకన్న
జగన్ చేతిగాని అసమర్ధత పాలన ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది. భవిష్యత్ లో కరోనా మరింత ఉదృతం కాబోతుందని ఆయనే చెబుతున్నారు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కరోనా జ్వరం లాంటిది, వస్తుంది, పోతుందని చిన్నపిల్లవాడిలా జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది.  కరోనాతో సహజీవనం చేయాలని ఆయన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. కరోనా మహామ్మారి ఎక్కువగా ఉందని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా అంటే ఏమీ లేదని జగన్ చెప్పడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు అనేక విపత్తు సమయంలో ఏపీని ఆదుకున్నారు. ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగితుంటే జగన్ మాత్రం సిల్లీగా ఉంటున్నారు. ప్రపంచ మేథావులు ఏం మాట్లాడుతున్నారు. అందుకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నారు. తెలంగాణలో కేసులు  తగ్గుతుంటే ఏపీలో కేసులు పెరుగుతున్నాయి. ప్రజలకు కరోనా రావాలని జగన్ కోరుకుంటున్నారా? కరోనా పుట్టిన చైనాలోను తగ్గుముఖం పడితే ఏపీలో మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఎందుకు ఆదర్శంగాతీసుకోవడం లేదు? ప్రాతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తామన్నారు. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు?  డాక్టర్లకు మాస్కులు లేవని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ లేదని చెప్పిన నగిరి మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు. 5 కోట్లకు 3 మాస్కులు కావాలంటే 15 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పటి వరకు ఎవరికి, ఎక్కడ ఇచ్చారు. కరోనాను అడ్డం పెట్టుకొని మాస్కుల రూపంలో స్కాం చేద్దామని చూస్తున్నారు. మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం లాక్ డౌన్ ను తొలగించాలని చెప్పడం సిగ్గుచేటు. తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతల మందు కంపెనీలను తెరిచి అమ్ముకొని ప్రజలను దోచుకునేందుకు మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తారా?  రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల మధ్య సరిహద్దులు ఏ మాత్రం ఉన్నాయి? కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా?  ప్రజలకు రూ.5వేలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు?  మూడు మాస్కులకు అయ్యే డబ్బులు ప్రజలకు ఇస్తే వాళ్లే మాస్కులు కొనుక్కుంటారు కదా?  విజయసాయిరెడ్డి  వైసీపీ మందిని రోడ్ల వెంటా తిప్పుతూ ఆర్బాటంగా తిరుగుతున్నారు.  కరోనా ఈ మాత్రం అదుపులో ఉందటానికి పోలీసులే కారణం. వారికి నా సెల్యూట్ చేస్తున్నాం. కాని అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయసాయిరెడ్డి లెక్కలేని తనంగా తిరుగుతున్నారు. పరిపాలన అవగాహన లోపంలో భాగంగా ఇవ్వన్ని జరుతున్నాయి. లాక్ డౌన్ తగ్గుముఖం పట్టాల్సింది ఎందుకు పెరుగుతున్నాయి. కరోనా తగ్గించలేకపోతే వైసీపీ నేతలనైనా కంట్రోల్ లో పెట్టాలి. వైసీపీ నేతల ఎలా భయట తిరుగుతున్నారు. ప్రజలు పాలనతో విసుగెత్తిపోయారు. ఆరోగ్య సర్వే జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారు. ఇదంతా అవాస్తవం. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? జగన్ ఇప్పటికైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఇటలీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆయన దాని గురించి మాట్లాడరు. ఇష్టానుసారంగా మాట్లాడే అనీల్ కుమార్ యాదవ్ కు కూడా నెల్లూరు లో కరోనా కేసులు కంట్రోల్ చేయడం చేతగాక చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి, బుగ్గన ఇద్దరూ జగన్ అవినీతి బండికి రెండు చక్రాలు. ఎప్పటికైనా రెండు టైర్లు పంచర్ అవ్వడం ఖాయం. వైన్ షాపులు ప్రభుత్వం తెరవటం విరమించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు పాలన చూశాం కాబట్టి జగన్ పాలన ఒక సారి చూద్దామని ప్రజలు భావించారు. పరిపాలన ఇచ్చారని ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజలు విప్లవం ద్వారా గద్దె దింపుతారు.          


                     బుద్ధా వెంకన్న
                    శాసనమండలి సభ్యులు


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image