రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు:పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేది : 13.05.2020.
అమరావతి.


రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు:పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి,మే13 : రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మంత్రి ఛాంబర్లో పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్ మురళిలతో మంత్రి గౌతమ్ రెడ్డి షుగర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్ కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం  10 షుగర్ ఫ్యాక్టరీలు ఉండగా 6 మూతపడ్డాయని, 4 పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.  ఈ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నివేదికను తయారు చేయాలని మంత్రి సూచించారు. మూతపడ్డ షుగర్ పరిశ్రమల ప్రస్తుత పరిస్థితులు, వాటిని మళ్ళీ పు:న ప్రారంభించడానికి అవసరమైన నిధులు, పరిశ్రమల్లో ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై మంత్రి చర్చించారు. త్వరలో ముఖ్యమంత్రితో రాష్ట్రంలో ఉన్న షుగర్ పరిశ్రమల అంశంపై సమీక్ష సమావేశం ఉండటంతో పూర్తి స్థాయి వివరాలను తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మూతపడిన షుగర్ పరిశ్రమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల సమస్యలు తదితర అంశాలను గుర్తించి, వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలకు ప్రభుత్వం కృషి చేయనుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరగబోయే సమీక్ష సమయానికి పూర్తి నివేదికలను సన్నద్ధం చేసుకొని తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు