మద్యం ధరల పెరుగుదల మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరచడానికే


                   సత్తెనపల్లి,మే 4 ( అంతిమ తీర్పు) :  మద్యం ధరల పెరుగుదల మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరచడానికేనని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన సత్తెనపల్లి లోని ప్రొహిబిషన్  మరియు ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగిస్తూ  సి పి ఐ,  సి పి ఐ(యo)పార్టీ లు గతంలో సంపూర్ణ మద్య నిషేధం అసాధ్యమని,మద్య  నియంత్రణే మేలని పేర్కొన్నాయని నేడు దీనికి భిన్నంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని వెంటనే అమలు చేయమని కోరడం హాస్యాస్పదo అన్నారు.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాద యాత్రలో,నవరత్నాలలో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా దశలవారీ మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
తత్ఫలితంగా దాదాపు 30 శాతం మద్యం వినియోగం 60 శాతం బీరు వినియోగం తగ్గిందన్నారు.మద్యం షాపుల సంఖ్యను ప్రతి సంవత్సరం 20 శాతం తగ్గించడం, మద్యం అమ్మే పనిగంటలు తగ్గించడం దశలవారీ మద్యనిషేధంలో భాగమేనన్నారు.2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో త్రీ స్టార్,ఫైవ్ స్టార్  హోటల్స్ లలో మినహ మరి ఎక్కడ మద్యం లేని పరిస్థితిని కల్పిస్తామన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్ గా మారిస్తే నేడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను మద్యరహిత ఆంధ్ర ప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. 


    మద్యం ధరలు పెరగడం వలన  నాటుసారా,  కల్తీకల్లు,  గంజాయి వినియోగం,ఉత్పత్తి పెరిగే ప్రమాదంవుందన్నారు. పోలీసు,ఎక్సైజు, రెవిన్యూ యంత్రాంగాల సమిష్టి కృషితో వీటిని నిర్మూలించడానికి కృషి జరుగుతుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను బలోపేతం చేస్తున్నామన్నారు. నాటుసారా,గంజాయి నిర్మూలనలో పోలీస్ పాత్ర పెరగాలన్నారు.
వైన్ షాపులకు వచ్చేవారు సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి.ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలన్నారు.ముఖ్యమంత్రి రాజకీయ దృఢ సంకల్పమైన దశలవారీ మద్య నిషేధం అమలును  ఏ ప్రజా ప్రతినిధి అయిన, అధికారులైనా నీరుకార్చవద్దని విజ్ఞప్తి చేశారు.
   
కరోనా  కట్టడికి లాక్ డౌన్ అమలులో భాగంగా మద్యం విక్రయాలు నిలిపి వేయడం జరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 49,533 లీటర్ల నాటుసారా పట్టుబడింది. ఈనెల 2వ తేదీ ప్రత్యేకంగా నిర్వహించిన దాడుల్లో 3,071 లీటర్లు పట్టుబడింది. లాక్ డౌన్ కాలంలో ఇంత వరకు మొత్తం 4,721 కేసులు నమోదుచేసి,4319 మందిని అరెస్టు చేశారు.12,21,103 లీటర్ల బెల్లం ఊట దొరికింది.1,251 వాహనాలను సీజ్ చేశారు. అలాగే 37,270 కిలోల నల్ల బెల్లాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను చెల్లించని మద్యంపై 134 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు.మద్యం అక్రమాలపై 14500,1800 425 4868 టోల్ ఫ్రీ నెంబర్ లకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.


      


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image