ప్రజా ఆరోగ్య భవిష్యత్ కై "బిజెపి విడ్మెడ్"  టెలిమెడిసిన్ యాప్ ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ

*ప్రజా ఆరోగ్య భవిష్యత్ కై "బిజెపి విడ్మెడ్"  టెలిమెడిసిన్ యాప్ ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ * 



గుంటూరు మే 12 :


సాయంత్రం 5:30  గంటలకు భాజపా రాష్ట్ర అద్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు " విడ్మెడ్ యాప్" ప్రారంభించారు రాష్ట్ర  డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో తయారుచేసిన యాప్ ను  ప్రారంభించారు. కార్యక్రమప్రారంభం ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులు,డాక్టర్స్ ఈ యాప్ యొక్క విధి విధానాలపై చర్చించారు. వీరిలో భాజపాకోర్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్  సహా ఇంచార్జి సునీల్ దేయోదర్ గారు,ఎమ్మెల్సీలు సోము వీర్రాజు,పివిఎన్ మాధవ్ మాజీమంత్రులు కామినేని శ్రీనివాస్ ,సేనక్కాయల అరుణ,రావెల కిషోర్ బాబు, మాణిక్యాలరావు,మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి గారు ,రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్  గారు పాల్గొనగా డాక్టర్స్ విభాగంనుండి డాక్టర్ ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉప కులపతులు డా.ఐ. వి.రావు, డా. సి.వి.రావు, డా. రవిరాజు, పాల్గొనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత డా.సి.ఎల్. వెంకట రావు వహించారు. వీరందరి సమక్షంలో జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కన్నా గారు  మీడియాకు వివరిస్తూ 
 ప్రయాణ పరిమితుల వల్ల బాధపడుతున్న వేలాది మందికి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌తో వైద్య సంప్రదింపులు జరపడానికి బిజెపి హెల్త్ వింగ్ “బిజెపి విడ్మెడ్” యాప్‌ను ప్రారంభిచింది అని కన్నా లక్ష్మీనారాయణ గారు తెలిపారు.  అనేక ఆస్పత్రులు మరియు వైద్యులు వ్యక్తిగతంగా OPD సేవలను అందించనందున, బయటకు వెళ్లి వైద్య సహాయం కోరేందుకు బాధపడుతున్న కోవిడ్ మరియు నాన్ కోవిడ్ రోగులకు బిజెపి విడ్మెడ్ సహాయం చేస్తుంది. బిజెపి విడ్మెడ్ వృద్ధులకు, మహిళలకు వరం మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంటర్నెట్ ద్వారా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తమను తాము నమోదు చేసుకోవచ్చు  అని మరియు ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదింవచ్చునని రోగులు, మెడికల్ డాక్టర్ లేదా స్పెషలిస్ట్‌తో వీడియో సంప్రదింపుల కోసం మరియు ప్రయోగశాల మరియు ఫార్మసీ సేవలకు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ యాప్ కు గత మార్చి 25 2020 న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( జాతీయ ఆరోగ్య మండలి) ఆమోదం తెలిపింది అని తద్వారానే ఈ అంశాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు భాజాపా ప్రారంభించింది అని దీని ద్వారా డాక్టర్ పేషేంట్ కు పరీక్షల సలహాలు ఇవ్వడమే కాకుండా మన రిపోర్ట్స్ కూడా పంపి  నిర్ధారణ అనంతరం మన ఫోన్ నెంబర్ కు డాక్టర్ సూచించిన మందుల జాబితా వస్తుందని దీనిని మన స్థానికంగా ఉన్న మందుల షాపుల్లో అనుమతింపబడుతుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అంతే కాక ఆరోగ్యసేతు యాప్ కు ఏవిధమైన ప్రచుర్యం లభించిందో అదేవిదంగా ఈ యాప్ ను ముందుకు తీసుకెళ్లాలని కన్నా కోరారు.
విడ్మెడ్ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ వినియోగదారుకు సహాయం అవసరమైనప్పుడు, టోల్-ఫ్రీ నంబర్ మరియు లైవ్ హెల్ప్‌డెస్క్ ఉన్నాయి, వారు సేవలను సమర్థవంతంగా పొందడంలో వినియోగదారులకు సహాయపడతారని కన్నా లక్ష్మీనారాయణ  మీడియాకు తెలిపారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image