ప్రజా ఆరోగ్య భవిష్యత్ కై "బిజెపి విడ్మెడ్"  టెలిమెడిసిన్ యాప్ ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ

*ప్రజా ఆరోగ్య భవిష్యత్ కై "బిజెపి విడ్మెడ్"  టెలిమెడిసిన్ యాప్ ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ * 



గుంటూరు మే 12 :


సాయంత్రం 5:30  గంటలకు భాజపా రాష్ట్ర అద్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు " విడ్మెడ్ యాప్" ప్రారంభించారు రాష్ట్ర  డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో తయారుచేసిన యాప్ ను  ప్రారంభించారు. కార్యక్రమప్రారంభం ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులు,డాక్టర్స్ ఈ యాప్ యొక్క విధి విధానాలపై చర్చించారు. వీరిలో భాజపాకోర్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్  సహా ఇంచార్జి సునీల్ దేయోదర్ గారు,ఎమ్మెల్సీలు సోము వీర్రాజు,పివిఎన్ మాధవ్ మాజీమంత్రులు కామినేని శ్రీనివాస్ ,సేనక్కాయల అరుణ,రావెల కిషోర్ బాబు, మాణిక్యాలరావు,మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి గారు ,రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్  గారు పాల్గొనగా డాక్టర్స్ విభాగంనుండి డాక్టర్ ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉప కులపతులు డా.ఐ. వి.రావు, డా. సి.వి.రావు, డా. రవిరాజు, పాల్గొనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత డా.సి.ఎల్. వెంకట రావు వహించారు. వీరందరి సమక్షంలో జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కన్నా గారు  మీడియాకు వివరిస్తూ 
 ప్రయాణ పరిమితుల వల్ల బాధపడుతున్న వేలాది మందికి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌తో వైద్య సంప్రదింపులు జరపడానికి బిజెపి హెల్త్ వింగ్ “బిజెపి విడ్మెడ్” యాప్‌ను ప్రారంభిచింది అని కన్నా లక్ష్మీనారాయణ గారు తెలిపారు.  అనేక ఆస్పత్రులు మరియు వైద్యులు వ్యక్తిగతంగా OPD సేవలను అందించనందున, బయటకు వెళ్లి వైద్య సహాయం కోరేందుకు బాధపడుతున్న కోవిడ్ మరియు నాన్ కోవిడ్ రోగులకు బిజెపి విడ్మెడ్ సహాయం చేస్తుంది. బిజెపి విడ్మెడ్ వృద్ధులకు, మహిళలకు వరం మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంటర్నెట్ ద్వారా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తమను తాము నమోదు చేసుకోవచ్చు  అని మరియు ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదింవచ్చునని రోగులు, మెడికల్ డాక్టర్ లేదా స్పెషలిస్ట్‌తో వీడియో సంప్రదింపుల కోసం మరియు ప్రయోగశాల మరియు ఫార్మసీ సేవలకు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ యాప్ కు గత మార్చి 25 2020 న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( జాతీయ ఆరోగ్య మండలి) ఆమోదం తెలిపింది అని తద్వారానే ఈ అంశాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు భాజాపా ప్రారంభించింది అని దీని ద్వారా డాక్టర్ పేషేంట్ కు పరీక్షల సలహాలు ఇవ్వడమే కాకుండా మన రిపోర్ట్స్ కూడా పంపి  నిర్ధారణ అనంతరం మన ఫోన్ నెంబర్ కు డాక్టర్ సూచించిన మందుల జాబితా వస్తుందని దీనిని మన స్థానికంగా ఉన్న మందుల షాపుల్లో అనుమతింపబడుతుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అంతే కాక ఆరోగ్యసేతు యాప్ కు ఏవిధమైన ప్రచుర్యం లభించిందో అదేవిదంగా ఈ యాప్ ను ముందుకు తీసుకెళ్లాలని కన్నా కోరారు.
విడ్మెడ్ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ వినియోగదారుకు సహాయం అవసరమైనప్పుడు, టోల్-ఫ్రీ నంబర్ మరియు లైవ్ హెల్ప్‌డెస్క్ ఉన్నాయి, వారు సేవలను సమర్థవంతంగా పొందడంలో వినియోగదారులకు సహాయపడతారని కన్నా లక్ష్మీనారాయణ  మీడియాకు తెలిపారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image