పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

*08–05–2020*
*అమరావతి*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


*అమరావతి:*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:*
*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సహా పలువురు అధికారులు హాజరు.*


*ఉపాధి హామీ పనులు*


కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయన్న అధికారులు
భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం అందుకున్నాయన్న అధికారులు
వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలన్న సీఎం
ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్న సీఎం


*గ్రామాల్లో అభివృద్ధి*


గ్రామాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతిని వివరించిన సీఎం.
గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవి: సీఎం
వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది: సీఎం


16,208  వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదించిన అధికారులు.
పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని వెల్లడి.
*పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి*
గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా  పూర్తి చేయడానికి యత్నిస్తున్నామన్న అధికారులు
మార్చి 31, 2021 కల్లా రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న అధికారులు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image