మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. :వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి  రాష్ట్ర చైర్మన్  మద్య విమోచన ప్రచార కమిటీ

07/05/2020.
                     గుంటూరు. 


 మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. 
      ----- మద్య విమోచన ప్రచార కమిటీ.


 పాదయాత్రలో, నవరత్నాల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దశలవారీ మద్యనిషేధం ఆచరణాత్మక అమలు ప్రణాళికలో భాగమే నేడు మద్యం ధరలు పెంచడమని  మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రకటించిన దశలవారీ మద్యనిషేధం అమలులో భాగంగా ఇప్పటి వరకు ప్రవేట్ మద్యం షాపులను తొలగించి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించుట,  గతంలో ఉన్న 4,380 షాప్ లను నేడు 2,900 షాప్ లకు తగ్గించుట,  బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించడం, పర్మిట్ రూములను తొలగించడం,మద్యం విక్రయించే సమయాన్ని కుదించడం, మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం,మద్యం ధరలను పెంచడం,డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మద్య నిషేధం లో భాగమే.తదితర చర్యలను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, వామపక్ష పార్టీలు గానీ, మహిళా సంఘాలు గాని స్వాగతించకపోవడం శోచనీయం.ఈ  చర్యల ఫలితంగా మద్యం  వినియోగం 30%, బీరు వినియోగం 60% తగ్గిందని రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనూ పేర్కొన్న విధంగా మద్యం ధరలను  షాక్  కొట్టేలా పెంచుతూ మధ్య వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో మద్యం షాపులను ప్రారంభిస్తే అదేదో ఒక ఆంధ్రప్రదేశ్ 
లో  మద్యం షాపులను తెరిచినట్లు ప్రతిపక్ష పార్టీలు,మహిళా సంఘాలు, విమర్శించడం తగదన్నారు. గొడుగులు,మాస్కులు ధరించి క్రమశిక్షణతో భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం విక్రయాలు జరిగే విధంగా అధికార యంత్రాంగం చూడాలన్నారు. ధరలు పెరగడం వలన నాటుసారా,గంజాయి,  కల్తీకల్లు వంటి మత్తు పదార్థాల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని వాటి నివారణకు ఎక్సైజ్ సిబ్బంది తోపాటు పోలీస్,రెవెన్యూ విభాగాల భాగస్వామ్యం పెరగాలన్నారు.ఏ రాజకీయ జోక్యం  ఉండరాదన్నారు.గత పది నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తూ మద్యం వినియోగం పేద వర్గాల్లో పెరగాలని కోరుకోవడం సహేతుకం కాదన్నారు.గతంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేసి, బెల్టు షాపులకు శ్రీకారం చుట్టడం తన పాలనలో మద్యoధ్రప్రదేశ్  గా మార్చడం జరిగిందని గుర్తు చేశారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ  మద్యనిషేధం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా అమలై ఆంధ్రప్రదేశ్ మద్య రహిత రాష్ట్రంగా రూపొందగలదని లక్ష్మణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


               వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి
                     రాష్ట్ర చైర్మన్ 
     మద్య విమోచన ప్రచార కమిటీ
              ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
                  99499 30670.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image