మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. :వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి  రాష్ట్ర చైర్మన్  మద్య విమోచన ప్రచార కమిటీ

07/05/2020.
                     గుంటూరు. 


 మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. 
      ----- మద్య విమోచన ప్రచార కమిటీ.


 పాదయాత్రలో, నవరత్నాల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దశలవారీ మద్యనిషేధం ఆచరణాత్మక అమలు ప్రణాళికలో భాగమే నేడు మద్యం ధరలు పెంచడమని  మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రకటించిన దశలవారీ మద్యనిషేధం అమలులో భాగంగా ఇప్పటి వరకు ప్రవేట్ మద్యం షాపులను తొలగించి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించుట,  గతంలో ఉన్న 4,380 షాప్ లను నేడు 2,900 షాప్ లకు తగ్గించుట,  బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించడం, పర్మిట్ రూములను తొలగించడం,మద్యం విక్రయించే సమయాన్ని కుదించడం, మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం,మద్యం ధరలను పెంచడం,డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మద్య నిషేధం లో భాగమే.తదితర చర్యలను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, వామపక్ష పార్టీలు గానీ, మహిళా సంఘాలు గాని స్వాగతించకపోవడం శోచనీయం.ఈ  చర్యల ఫలితంగా మద్యం  వినియోగం 30%, బీరు వినియోగం 60% తగ్గిందని రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనూ పేర్కొన్న విధంగా మద్యం ధరలను  షాక్  కొట్టేలా పెంచుతూ మధ్య వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో మద్యం షాపులను ప్రారంభిస్తే అదేదో ఒక ఆంధ్రప్రదేశ్ 
లో  మద్యం షాపులను తెరిచినట్లు ప్రతిపక్ష పార్టీలు,మహిళా సంఘాలు, విమర్శించడం తగదన్నారు. గొడుగులు,మాస్కులు ధరించి క్రమశిక్షణతో భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం విక్రయాలు జరిగే విధంగా అధికార యంత్రాంగం చూడాలన్నారు. ధరలు పెరగడం వలన నాటుసారా,గంజాయి,  కల్తీకల్లు వంటి మత్తు పదార్థాల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని వాటి నివారణకు ఎక్సైజ్ సిబ్బంది తోపాటు పోలీస్,రెవెన్యూ విభాగాల భాగస్వామ్యం పెరగాలన్నారు.ఏ రాజకీయ జోక్యం  ఉండరాదన్నారు.గత పది నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తూ మద్యం వినియోగం పేద వర్గాల్లో పెరగాలని కోరుకోవడం సహేతుకం కాదన్నారు.గతంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేసి, బెల్టు షాపులకు శ్రీకారం చుట్టడం తన పాలనలో మద్యoధ్రప్రదేశ్  గా మార్చడం జరిగిందని గుర్తు చేశారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ  మద్యనిషేధం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా అమలై ఆంధ్రప్రదేశ్ మద్య రహిత రాష్ట్రంగా రూపొందగలదని లక్ష్మణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


               వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి
                     రాష్ట్ర చైర్మన్ 
     మద్య విమోచన ప్రచార కమిటీ
              ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
                  99499 30670.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు