సొంత రాష్ట్రానికి చేరిన వలస కూలీలు

**సొంత రాష్ట్రానికి.  చేరిన వలస కూలీలు.
**గారికాపాడు చెక్ పోస్ట్ వద్ద వలస కూలీలకు స్వాగతం పలికి   ఆహ్వానించిన, ప్రభుత్వ విప్  జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  SP  రవీంద్రనాథ్ IPS., 
------------------------------------------------


 *గుజరాత్ రాష్ట్రం నుండి గరికపాడు చెక్పోస్ట్ ద్వారా 12 బస్సులలో రాష్ట్రానికి చేరిన 887 మంది మత్స్యకారులు* 
 *
**వారికి స్వాగతం పలికిన జగ్గయ్యపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు,జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు, పిడిడిఆర్డిఎ శ్రీనివాస్ గారు ప్రభుత్వ యంత్రాంగం**
 
 *మొత్తం 12 బస్సులలో 887 మంది రాక* 


 *శ్రీకాకుళం 700 మంది* 


 *విజయనగరం 98 మంది* 


 *విశాఖపట్నం 77 మంది* 


 *తూర్పుగోదావరి ఐదు మంది* 


 *ఒడిశా రాష్ట్రం ఆరు మంది ,చత్తీస్గడ్ ఒకరు.*


 *చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు అల్పాహారం త్రాగునీరు అందించిన పోలీసు అధికారులు*


 _ఎస్పీ గారు మాట్లాడుతూ_ .......


**ఉత్తరాంధ్ర నుండి  వివిధ పనుల నిమిత్తం మత్స్యకార కుటుంబాలు గుజరాత్ రాష్ట్రానికి వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నారని**


**లాక్ డౌన్అమలు నేపథ్యంలో  రాష్ట్రం నుండి అక్కడకు వెళ్లి, చిక్కుకుపోయిన మత్స్యకారుల సంరక్షణార్థం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మత్స్యకార మంత్రిగారు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న కష్టాలను చూసి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు**


**ప్రభుత్వం వారు నిర్వహించే వైద్య పరీక్షలకు అందరూ సహకరించాలని తెలిపారు**


*ముఖ్యమంత్రిగారి గారి చొరవ వల్ల అక్కడ చిక్కుకున్న 4400  మందిని రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు**


*వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాష్ట్రాలను దాటుకుని మొదటి విడతగా 12 బస్సులు రావడం జరిగిందన్నారు**


**12 బస్సులో వచ్చిన 887 మందిని ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు పోలీసు యంత్రాంగం ఆహ్వానించడం జరిగింది అన్నారు.వారికి ఆహారం, త్రాగు నీరు అందించి, వారి వారి ప్రాంతాలకు పోలీసు బందోబస్తు ఎస్కార్టుతో  పంపించడం జరుగుతుంది అన్నారు.వచ్చిన మత్స్యకార కుటుంబాలను వారి వారి ప్రాంతాలకు ఈరోజు సాయంత్రం లోపు పంపించడం జరుగుతుంది.వీరిలో ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.అవసరం మేరకు వారిని quarantine సెంటర్లకు పంపి వైద్య అందించడం జరుగుతుంది.వారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉంటే వారిని హౌస్ ఖ్వారంటైంన్ కు పంపించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు, నందిగామ డిఎస్పీ రమణ మూర్తి గారు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్ గారు, జగ్గయ్యపేట CI నాగేంద్ర కుమార్ గారు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image