మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ అభ్యర్థులకు తీరని అన్యాయం .:ఎం.నాగ మధు యాదవ్,NSUI ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు

 -: మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ అభ్యర్థులకు తీరని అన్యాయం .* :M Naga madhu yadav.,  NSUI State President AP


*మెడికల్ పీజీ అడ్మిషన్ల కొరకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న జీవో నెంబర్ 43 రూపొందించినది . 


*ప్రభుత్వం రూపొందించిన ఈ జీవో రాజ్యాంగ స్ఫూర్తికి,సుప్రీం కోర్టు తీర్పులకు , రిజర్వేషన్ల విధానానికి పూర్తిగా విరుద్ధం .


*జీవో నెంబర్ 43 మేరకు మెడికల్ పీజీ అడ్మిషన్లలో రిజర్వ్డ్ కేటగిరీ కి చెందినటువంటి అభ్యర్థి ఓపెన్ మెరిట్ లో ఒక స్పెషలైజేషన్లో ప్రవేశం పొంది అదే స్పెషలైజేషన్లో మరొక కళాశాలకు రిజర్వ్ కేటగిరీలో కి స్లైడ్ అయితే అతడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీ కి చెందిన అభ్యర్థి తో భర్తీ చేస్తారు. 


*కానీ రిజర్వ్డ్ కేటగిరీ కి చెందిన అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఒక కళాశాలలో సీటు పొంది అదే కళాశాలలో కానీ లేదా ఇతర కళాశాలలో కానీ మరొక స్పెషలైజేషన్ లోకి slide అయితే అతడి పూర్వపు సీటును ఓపెన్ కేటగిరీ అభ్యర్థి చేత భర్తీ చేస్తారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం ,రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం .


*ఇక్కడ మనకు ఒక విషయంపై స్పష్టత రావాల్సి ఉంది మెడికల్ యూజీ (MBBS)సీట్లలో సారూప్యత ఉండడంవల్ల అభ్యర్థి కళాశాల కు ప్రాధాన్యత ఇస్తాడు. కానీ పీజీ అడ్మిషన్లలో  కళాశాల కన్నా అభ్యర్థి స్పెషలైజేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు .


 


*రిజర్వుడు అభ్యర్థి అదే స్పెషలైజేషన్ కు స్లైడ్ అయితేనేఆ సీటును అదే రిజర్వేషన్ కు సంబంధించిన  అభ్యర్థిఅభ్యర్థికి కేటాయిస్తాము  కానీ వేరే స్పెషలైజేషన్ కు మారితే అతడి సీటును ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తాము అనే కుట్రపూరిత నిబంధనలు రూపొందించారు .


*ఈ నిబంధనతో రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులు వందలాది సీట్లు కోల్పోతున్నారు .ఇది ఖచ్చితంగా ఉన్నత కులాల వారి కుట్ర .పేద మధ్యతరగతికి చెందిన రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడంలో భాగము.


*ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం OBC లనుమరో విధంగా మోసం చేస్తోంది. OBC ల పట్ల వివక్ష చూపుతూ వైద్య విద్యకు దూరం చేస్తూ ఉన్నది .రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లోని 50 శాతం PG  సీట్లను నేషనల్ పూల్ కు బదలాయించారు. ఈ సీట్లను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పూల్ లోని సీట్లను OBC లకు కేటాయించడం లేదు దీని ద్వారా ప్రతి సంవత్సరం OBC లు దాదాపు 5 వేల పీజీ మెడికల్ సీట్ల నష్టపోతున్నారు.ఒకవైపు కేంద్ర ప్రభుత్వం OBC రిజర్వేషన్లు అమలు పరచక బీసీలకు నష్టం కలగ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయి .


*ఒకవైపు సుప్రీంకోర్టు 16. 9. 1992 ఇందిరా సహాని కేసు లో ,
15.2.1996 రితేష్ R షా కేసులో,
11.01. 2018 త్రిపురారి శరణ్ కేసులో ,
ఓపెన్ కేటగిరీలో సీటు సాధించిన రిజర్వుడు అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ గానే పరిగణించాలి కానీ రిజర్వ్ అభ్యర్థిగా చూడకూడదు .దీని వల్ల 50 శాతం రిజర్వేషన్లు అదిగమనించినట్టు కాదు అని పలుసార్లు స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పులను పరిగణలోకి తీసుకోవడం లేదు.


* బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం గా చెప్పుకునే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి జీవో నెంబర్ 43 రద్దు చేసి త్వరలో జరగబోయే మెడికల్ పీజీ కౌన్సిలింగ్ లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి .


*ఓపెన్ కేటగిరీలోఒక స్పెషలైజేషన్లో  సీటు సాధించిన రిజర్వుడ్ అభ్యర్థి అదే స్పెషలైజేషన్ కు కానీ లేదా వేరే స్పెషలైజేషన్ కు కానీ అదే కళాశాలలో కానీ లేదా వేరే కళాశాలకు కానీ స్లైడ్ అయితే అతడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థి తోనే భర్తీ చేయాలి.సుప్రీంకోర్టు 11 .1. 2018 లో  త్రిపురారి శరణ్  కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలి .


రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్  వర్గాలకు న్యాయం చేయకపోతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన  మంత్రులను, నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారిని తమ పదవులకు రాజీనామా చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీలకు చెందిన ప్రజల హక్కుల కొరకు పోరాడాలి అని డిమాండ్ చేస్తున్నాం.


నమస్కారములతో...........                          M Naga madhu yadav.                             NSUI State President AP


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image