పశ్చిమగోదావరి జిల్లా సంయిక్త కలెక్టర్ గా (అభివృద్ది) రేపు బాధ్యతలు తీసుకోనున్న హిమాన్హు శుక్లా

సంయిక్త కలెక్టర్ గా (అభివృద్ది) రేపు బాధ్యతలు తీసుకోనున్న హిమాన్హు శుక్లా
చిన్న వయస్సులోనే పర్యాటక సంచాలకులుగా చెరగని ముద్ర
నాటి ఎన్నికల వేళ గుంటూరు సంయిక్త కలెక్టర్ గా వినూత్న శైలి
నేతన్న నేస్తం అమలు ద్వారా చేనేతలలో జీవితాలలో వెలుగులు
కరోనా నియంత్రణ ముసుగుల తయారీ, పంపిణీలొ యుద్ద ప్రాతిపదికన చర్యలు


ఏలూరు, మే11: తాజా మార్పులలో భాగంగా జిల్లా సంయిక్త క‌లెక్ట‌ర్‌గా బ‌దిలీ అయిన హిమాన్హు శుక్లా బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. లేపాక్షి, ఆప్కో సంస్ధల ఎండిగా, చేనేత జౌళి శాఖ సంచాలకులుగా ఉన్న శుక్లాను ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న అభివృద్ది విభాగపు సంయిక్త కలెక్టర్ గా జిల్లాకు పంపించింది. తొలి ప్ర‌య‌త్నంలోనే టాప్ ర్యాంక‌ర్‌గా ఐఎఎస్‌కు ఎంపికైన శుక్లా తొలిగా 2015 డిసెంబ‌ర్‌లో తిరుప‌తి స‌బ్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించి 2016 న‌వంబ‌ర్‌లో ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులుగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 2017 ఏప్రిల్ 1న ఎపిటిడిసి ఎండిగానూ ప్ర‌భుత్వం ఆయ‌న‌నే నియ‌మించింది. తదుపరి 2019 ఫిబ్రవరి11న గుంటూరు సంయిక్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుక్లాను, ఎన్నికల తదుపరి చేనేత రంగంపై ప్రత్యేక అభిమానాన్ని చూపించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశాఖకు సంచాలకులుగా నియమించగా అదే సంవత్సరం జూన్ 24న బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఆగస్టు 1న లేపక్షి ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్ లో ఎపి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సిఇఓ గాను శుక్లాకే ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా ప్రత్కేక అధికారి గాను హిమాన్హు శుక్లా తనదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. నిజానికి క‌నీసం ఇర‌వై సంవ‌త్స‌రాల స‌ర్వీసు పూర్తి చేసిన వారు చేసే ప‌ద‌వుల‌ను జూనియ‌ర్ లెవ‌ల్ అధికారిగానే శుక్లా నిర్వ‌హించారు. శుక్లా ప‌ర్యాట‌క రంగాన్ని ప‌రుగులు పెట్టించారనే చెప్పాలి. 
స‌మీకృత ప‌ర్యాట‌క అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపారు. విభ‌జ‌న అవాంత‌రాల‌ను అధిక‌మిస్తూ న‌వ్యాంధ్ర‌ను ప‌ర్యాట‌కాంధ్ర‌గా రూపుదిద్దారు. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగ అభివృద్దితో మాన‌వ వ‌న‌రుల స‌ద్వినియోగం అన్న ఆలోచ‌న‌కు కార్యరూపం క‌ల్పిస్తూ ఆయ‌న త‌న‌ ప‌ద‌వీకాలంలో అమ‌లు చేసిన నిర్ణ‌యాలు స‌త్‌ఫ‌లితాల‌ను ఇచ్చాయి. కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో పాటు, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కాయి. రెండేళ్ల శుక్లా ప‌ద‌వీ కాలంలో ప‌ర్యాట‌క రంగంలో రూ.5,300 కోట్లు పెట్టుబ‌డులు త‌ర‌లిరాగా, 25,000 మంది ప్ర‌త్య‌క్షంగా ఉపాధి పొందారు. ఆయన పదవీ కాలం ప్రారంభం నాటికి 6,700 మాత్ర‌మే అతిధ్య గ‌దులు ఉండ‌గా ఆసంఖ్య‌ను ప్ర‌స్తుతం 14,600కు తీసుకు వెళ్లగ‌లిగారు. ప‌ర్యాట‌క పాద‌ముద్ర‌ల ప‌రంగా దేశంలోనే మూడ‌వ స్ధానంలో ఎపి ఉండ‌టం, వారి రాక 15 శాతం మేర పెర‌గ‌టం, విభ‌జ‌న నాటికి నాలుగు మాత్ర‌మే ఉన్న ఐదు న‌క్ష‌త్రాల హోట‌ళ్లు ప‌దికి చేర‌టం, మ‌రో ప‌ది నిర్మాణంలో ఉండ‌టం ఇలా శుక్లా త‌న‌దైన ముద్ర‌ను చూప‌గ‌లిగారు. ఆ రెండెళ్ల‌లో అంత‌ర్జాతీయ సంస్ధ‌లు, కేంద్ర‌ప్ర‌భుత్వం నుండి 36 అవార్డులు ప‌ర్యాట‌క శాఖను వ‌రించ‌గా, వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రం నుండి స‌మీకృత ప‌ర్యాట‌క అభివృద్ది సాధించిన రాష్ట్రంగా అవార్డులు అందుకోవ‌టం చిన్న విష‌యం కాదు. 
గుంటూరు సంయిక్త కలెక్టర్ గా పనిచేసిన కాలంలో రహదారి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి సామాజిక సేవను శిక్షగా విధించే వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్ర స్దాయిలో చర్చకు కారణం అయ్యారు, అప్కో ఎండిగా చేనేత కార్మికుల ఆసక్తులను గమనిస్తూ తదనుగుణంగా విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. నవరత్నాలు అమలులో భాగంగా ఎనభై రెండు వేల కుటుంబాలకు నేతన్న నేస్తం పధకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసి ముఖ్యమంత్రి మన్ననలు పొందారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను తీసుకువచ్చే కార్యాచరణ మేరకు అమెజాన్ వంటి సంస్ధతో ఒప్పందం చేసుకుని చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చి, చేనేత కార్మికులు మరింత అదాయం పొందగలిగేలా భరోసా ఇచ్చారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ ముసుగులు (మాస్క్) పంపిణీ చేయాలన్న ఆలోచన మేరకు 15 కోట్ల మాస్క్ ల తయారీ వ్యవస్ధకు సమన్వయం వహించి ఇప్పటికే ఏడు కోట్ల మాస్క్ ల పంపిణీని పూర్తి చేసారు. ఈ నేపధ్యంలో బుధవారం జిల్లా సంయిక్త కలెక్టర్ (అభివృద్ది)గా ఆయన భాధ్యతలు తీసుకోనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image