ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

*ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ* వింజమూరు, మే 8 (రిపోర్టర్ - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం జనార్ధనపురం గ్రామంలోని  ఎస్.సి, బి.సి కాలనీలలోని పేద ప్రజలకు శుక్రవారం నాడు అంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.టి.ఎఫ్- 1938) ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ.పి.టి.ఎఫ్ మండల శాఖ అధ్యక్షులు జక్కం.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ విధించడం వలన మన దేశంలో ఈ వైరస్  అధికం కాకుండా కట్టడి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా అటు పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు మిగతా దేశాలతో పోలిస్తే మన పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయన్నారు. ప్రజలందరూ స్వీయ నిర్భంధంలో ఉంటూ తగు జాగ్రత్తలు పాటించడం కూడా ఇందుకు దోహదపడ్డాయన్నారు. కనుక ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు అందించే సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆచరణలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ సమయంలో కూలీ పనులు అంతంత మాత్రంగా ఉన్నందున పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు ఇప్పటికే ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విరివిగా సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాయన్నారు. బియ్యం, వంట సరుకులు, పౌష్టికాహారం తదితరాలను ఇప్పటికే పలు చోట్ల పంపిణీ చేయడం జరిగిందని, తాజాగా జనార్ధనపురం కాలనీలలో కూరగాయలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు పర్వతరెడ్డి కొండారెడ్డి, ఎస్.కే.నాయబ్ రసూల్, యం.వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు