ప్రపంచమంతా కరోనాకి మందు తయారు చేస్తుంటే జగన్ మద్యం తయారీ చేస్తున్నారు : కిమిడి కళా వెంకట్రావు

  03.05.2020



ప్రపంచమంతా కరోనాకి మందు తయారు చేస్తుంటే జగన్ మద్యం తయారీ చేస్తున్నారు


తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఎవరూ వెళ్లొద్దు అని స్పష్టం గా చెప్పిందంటే రాష్ట్రంలో ఎంత భయానక పరిస్థితి ఉందో అర్ధమవుతోంది


 


     .. ...........కళా వెంకట్రావు


 ప్రపంచమంతా కరోనా నివారణకు మందు తయారీ చేసే పనిలో ఉంటే జగన్ మాత్రం తన కమీషన్ల కోసం  మద్యం తయారీ చేయించే పనిలో ఉన్నారు.  రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగి నిత్యావసర దుకాణాలే మూసేసే పరిస్థితి ఉంటే...మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటి. మద్యం షాప్ లు  ఏమైనా మెడికల్ షాప్ లా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మద్యం తయారీ చేయాల్సిన అవసరం ఏంటి? మీ జె టాక్స్ కోసం  ప్రజల ప్రాణాలు తీస్తారా?   రైతులు పంటలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు,  ఆరుగాలం శ్రమించి పండించి న పంటలు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందుల తో అన్న దాతలు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. మరో వైపు కళ్లు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు . కానీ జగన్ మాత్రం వారి గురించి పట్టించుకోకుండా తన కమీషన్ల కోసం మద్యం తయారీ  మీద దృష్టి పెట్టడం సిగ్గుచేటు.


  
 లాక్ డౌన్ లోనూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వైసీపీ నేతలు, వలంటీర్లు అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. వాలంటీర్లు నాటు సారా తయారీ చేస్తున్నారు. వలంటీర్ల కు నెల నెలా జీతాలు ఇచ్చి మరీ జగన్ వారి చేత నాటు సారా తయారీ చేయిస్తున్నారా? జగన్నన్న అమ్మవడి పధకం లా, జగనన్న  నాటు సారాతో నోరుతడి పథకం ఏమైనా రాష్ట్రంలో అమలవుతుందా? లాక్ డౌన్ పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దు, మద్యాన్ని ఆర్ధికవనరుగా పరిగణించడం అనైతికత. దశలవారీగా మద్యపాన నిషేధం అన్న జగన్ దశలవారీగా మద్యాన్ని విస్తృతం చేస్తున్నారు.


ఏపీకి ఎవరూ వెళ్ళొద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో ఎంత భయానక పరిస్థితి ఉందొ అర్ధమవుతోంది.  కరోనపై వాస్తవాలు దాచి బుగ్గన ప్రజలను మోసం చేస్తున్నారు. బుగ్గన ఆర్ధిక మంత్రా లేక అబద్దాల మంత్రా? ఉపాధి లేక పస్తులుండలేక రాజమండ్రి లో ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది.దీనికి బుగ్గన ఏం సమాధానం చెబుతారు?  ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డాక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు మాట్లాడటం లేదు.ఓ వైపు ఆరోగ్య శాఖ మంత్రి ఏమో ప్రవేట్ డాక్టర్లు 24 గం అందుబాటులో ఉండాలంటారు, మరో వైపు ప్రభుత్వం ఏమో డాక్టర్లు టైమ్ దాటి బయటకు రాకుండా ఆంక్షలు విధించి ప్రవేట్ డాక్టర్లు ను హించిస్తున్నారు.


 
 మద్యం డిస్టరీలు ఓపెన్ చేసి మద్యం తయారు చేయించే బదులు అన్న క్యాంటీన్ లు తెరచి  పేదల ఆకలి తీర్చవచ్చు కదా. కరోనా వల్ల ఉపాది లేక పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తో అలమటిస్తున్నారు.  జగన్ అన్న  క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారో  రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.  ఆధునిక యుగంలో కూడా రాష్ట్రం లో పేదలు అర్దాకలితో అలమటిస్తున్నారంటే వైసీపీ నేతలు సిగ్గుపడాలి. పేదలకు పట్టేడన్నం పెట్ట లేని ప్రభుత్వం ఎందుకు?  వైసీపీ పాలనలో వైసీపీ నేతల ధన దాహం తీరుతుంది కానీ పేదల ఆకలి మాత్రం తీరడం లేదు. ప్రజలకు రూ. 5 తో  3 పూటలా అన్నం పెట్టలేని జగన్ 3 రాజధానులు ఎలా కడతారో దేవుడికే తెలియాలి.


S/d


కిమిడి కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image