పైడ రామమ్మా ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అనేక సేవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తో  50 రోజులు  దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 13.05.2020 పైడ రామమ్మా ప్రథమ వర్థంతి సందర్భంగా వారి కుమారుడు అయినటి వంటి పైడ శశీకిరణ్ వారి సహాయ సహకరాలతో సొసైటీ లోని వరదా నగర్ లోని  80 గిరిజన పేద కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన కమిషనర్ ఓబులేసు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్ర శేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ఎం. మస్తణయ్య, రవికుమార్,గ్రానైట్ ప్రభాకర్, ప్రజెందర్ రెడ్డి, కరిముల్ల,ఆలీ, ఉదయ శేఖర్ రెడ్డి,వాచ్ షాప్ రాము,C.V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.