ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతి మే 10 (అంతిమ తీర్పు) :


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.


కరోనా కష్టాలకు తోడు కరెంట్ కష్టాలు ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి.


విద్యుత్ బిల్లులు 30 రోజులకు మాత్రమే యూనిట్లు విభజించి, రెండు నెలలకు విడివిడిగా బిల్లు తీసి పాత శ్లాబు విధానాన్ని అమలు చేయండి.


ఈ కష్టకాలంలో కరెంటు చార్జీలు పెంచుతున్నట్లు విద్యుత్‌ సంస్థలు ముందుగా ప్రకటించకుండా అమల్లోకి తేవడం సరికాదు.


కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై విద్యుత్ చార్జీలు పిడుగులా పడ్డాయి.


మే నెలలో 5వ తేదీ నుంచి 15 వరకూ గత రెండు నెలల రీడింగ్‌ తీయటం వల్ల యూనిట్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోవడంతో కేటగిరీలు మారి బిల్లులు రెట్టింపు పైగా వచ్చాయి.
- రామకృష్ణ.