ఎక్కడి వారు అక్కడే : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 


*03–05–2020*
*అమరావతి*
*కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం శ్ర  వైయస్‌.జగన్‌ సమీక్ష *


*అమరావతి:*
*కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*
*ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం*
*డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు హాజరు*


*ఎక్కడి వారు అక్కడే – సమీక్షా సమావేశంలో నిర్ణయం:*


పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు పెద్ద  ఎత్తున రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వేలల్లో విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పొరుగురాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది కష్టం అనిపించినా... విపత్తు దృష్ట్యా, ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడవాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో నిర్ణయం ప్రకారం...


– ఎక్కడివారు అక్కడే ఉండాలి
– పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
– సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు
– కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి
– ప్రస్తుతం ఇలా వస్తున్న వలసకూలీలు వేలల్లో ఉంటున్నారు
– వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం
– వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది
– అందువల్ల మిగిలిన వారు సహకరించాలి
– కోవిడ్‌–19 విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమకరం
– ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ
– అంతేకాదు మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుంది
– ప్రజారోగ్యం కోసం ఏపీలో పెద్ద  ఎత్తున కోవిడ్‌ –19 నివారణా చర్యలు
– ప్రభుత్వం చర్యలకు ప్రజలనుంచి సహకారం కొనసాగాలి
– కోవిడ్‌–19పై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం
– ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి


*గ్రామ, వార్డు సచివాలయాల్లో క్వారంటైన్‌ సదుపాయాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు:*


– విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులకోసం క్వారంటైన్‌ సదుపాయాల కల్పన ముమ్మరం చేయాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. 
– భోజనం, టాయిలెట్స్, బెడ్స్, బెడ్‌ షీట్లు వీటన్నింటినీ సిద్ధంచేసుకోవాలన్నారు. 
– యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలని సీఎం చెప్పారు.
– గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికగానే కాకుండా... జనాభా, అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం నిర్దేశించారు. 


– దీనికి సంబంధించి మార్గదర్శకాలను వీలైనంత త్వరగా తయారుచేయాలని, దీనికోసం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. 
– అలాగే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వారి భద్రత దృష్ట్యా కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక రైళ్లద్వారా పంపాలని నిర్ణయించారు. 
– దీనికి అవుతున్న ఖర్చులు, భోజనం ఖర్చులతో సహా అన్నీకూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు వెల్లడించారు. 
– ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లుతో కూడిన ఒక కిట్‌ కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
– అంతర్‌ జిల్లాల్లో కూలీలను పంపేటప్పుడు బస్సుల ద్వారా పంపాలని సమావేశంలో నిర్ణయించారు.


*నమోదైన కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు :*
– రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌  కేసుల వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. 
– గడచిన 24 గంటల్లో 58 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 
– అలాగే డిశ్చార్జి అయిన వారిసంఖ్య 47 గా వెల్లడించారు. 
– 1,14,937  పరీక్షలు చేసినట్టుగా తెలిపారు. 
– నిన్న ఒక్కరోజే 6534 టెస్టులు చేసినట్టుగా పేర్కొన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 2152 గా ఉందని తెలిపారు. దేశంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నామని వెల్లడించారు. 
– రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.38గా నమోదయ్యిందని, దేశంలో ఇది 3.81 గా ఉందని, అలాగే రాష్ట్రంలో మరణాల శాతం 2.08గా నమోదయ్యిందని, దేశంలో 3.32 శాతంగా నమోదయ్యిందని వెల్లడించారు. 
– కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల కేసులు పెద్దగా లేవని అధికారులు తెలిపారు.
– సర్వేలో గుర్తించిన వారికి జోరుగా పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 
32,792 మందిలో ఇప్పటివరకూ 23,639 మందికి చేశామని, మిగిలిన వారికి రెండు రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. 


*పటిష్టంగా టెలిమెడిసిన్‌:*
– టెలిమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, ఈ విధానం బలోపేతం కోసం కొన్ని ఆదేశాలు జారీచేశారు.
– మిస్డ్‌కాల్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడు సార్లు చొప్పున మూడుసార్లు చేయాలని.. అప్పుడే.. ఆ కాలర్‌ అందుబాటులో లేడని గుర్తించాలని సీఎం అన్నారు. 
– గ్రామస్థాయిల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఈలోగా టెలిమెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చిన వారికి మందులు డోర్‌ డెలివరీ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. 
– దీనికోసం ద్విచక్రవాహనాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే థర్మల్‌ బాక్స్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. 
– ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభం అయిన తర్వాత నేరుగా అక్కడే మందులు సహా ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు. 
– దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 


*మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా మరిన్ని చర్యలు – మద్యం ధరలు పెంపు – రానున్న రోజుల్లో మరింతగా తగ్గనున్న మద్యం దుకాణాలు:*


– మద్యం దుకాణాలు తెరవ వచ్చంటూ కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు. మద్యం నియంత్రణ మన విధానమని ఆదిశగా అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దుకాణాల వద్ద రద్దీ లేకుండా, భౌతిక దూరం పాటించాల్సిన అవసరంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దీనికోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


– *మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు.*
– మద్యం ధరలను 25శాతం శాతం పెంచాలని నిర్ణయించారు. అంతేకాక రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింతగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
– సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారంలోకి రాగానే 20శాతం దుకాణాలను అంటే 4380 నుంచి 3500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా ఏరివేశారు. మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకు వచ్చారు. ప్రస్తుత నిర్ణయం కారణంగా మద్యందుకాణాల సంఖ్య మరింతగా తగ్గనుంది. 
– మద్యం అమ్మకాల వద్ద భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించనున్నారు. 
– అలాగే మద్యం అమ్మకాల వేళలను కూడా నియంత్రించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు విధివిధానాలను ఖరారుచేయనున్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image