నిత్యావసర వస్తువులు పంపిణీ

గూడూరు. తే 2-05-2020 ది, ఉదయం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాజుద్దీన్ దాతల సహాయముతో  రావి చెరువు కట్ట మీద ఉన్న 50 కుటుంబాలకు, ముఖ్య అతిధులుగా విచ్చేసిన గూడూరు తహసిల్దార్ లీలారాణి మరియు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు, మరియు అంతర్జాతీయ మానవ హక్కలు,నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్  చేతులు మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ 10రోజులకు సరిపడా ఇవ్వటం జరిగింది. అదే విదంగా సుమారు 32 మంది దివ్యంగులుకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ లీలారాణి , తాజుద్దీన్ ,మయూరి శ్యామ్ యాదవ్ , విఆర్వోలు మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.