మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి

 


మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి.


కేసులు నమోదు అయినా భయపడాల్సిన పనిలేదు, రెడ్ జోన్ నియమాలను పాటించండి.. జిల్లా కలెక్టర్, సత్యవేడు శాసనసభ్యులు


నాగలాపురం, పిచ్చాటూరు, మే 12 : జిల్లాలో కోయంబేడు మార్కెట్ తో సంబంధాలు వున్న కేసులు నమోదు జరుగుతున్నాయని, ఇప్పటికే మార్కెట్ తో సంబంధాలు వున్నవారిని జాబితా మేరకు కోవిడ్ స్యాబ్ పరీక్షలు నిర్వహణ జరుగుతున్నదని రెడ్ జోన్ లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. మంగళవారం మద్యాహ్నఁ నాగలాపురం, పిచ్చాటూరు మండల కేంద్రాల్లో పాజిటివ్ నమోదు ప్రాంతాలను సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం కలసి జిల్లా కలెక్టర్ పర్యటించారు. రెడ్ జోన్లలో శానిటేషన్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  పాజిటివ్ కేసులు నమోదు అయిన మాత్రాన భయపడాల్సిన పనిలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కోయంబేడు కాంటాక్ట్ జాభితా గుర్తించి మండలాల వారిగా పంపించడం జరిగిందని, సెకండరీ కాంటాక్ట్ పై దృష్టి పెట్టాలని, 60 సం. పైబడిన వారిని తప్పనిసరి టెస్టులు చేయాలని, నెగటివ్ వున్నా క్వారేంటైన్ కు పంపాలని సూచించారు.  భౌతిక దూరం, మాస్కులు వంటి జాగ్రత్తలు
అలవాటు చేసుకోవాలని సూచించారు. బయట రాష్ట్రంలో ఉన్న మనవాళ్లు స్వంత గ్రామాలకు రానున్నారని, వారి క్వారేంటైన్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు 4900 గుర్తించి 20,000 మందికి సరిపడా వసతి,  బస 14 రోజులపాటు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కోయంబేడు కాంటాక్ట్ లు ఏఒక్కరు తప్పిపోకుండా గుర్తింపు, బయటి ర్రాష్టాల నుండి రానున్న మన జిల్లా వాసులకు క్వారేంటైన్ భాద్యత తహసీల్దార్ లు చూడాలని సూచించారు. జిల్లాకు రానున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


జిల్లా కలెక్టర్ పర్యటన లో మండల అధికారులు, వైద్య అధికారులు, పోలిస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు