ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు

ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు


వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): వింజమూరులోని పాతూరు ప్రాంతంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులలో శుక్రవారం నాడు పంచాయితీ సిబ్బంది క్లోరినేషన్ పనులు చేపట్టారు. ట్యాంకుల పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించడంతో పాటు సున్నం, బ్లీచింగ్ పౌడర్ లతో ట్యాంకులను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో గత 50 రోజులుగా పంచాయితీ పరిధిలో రెట్టింపు స్థాయిలో పారిశుద్ద్య పనులను ఉద్యమ తరహాలో నిర్వహిస్తున్నామన్నారు. వింజమూరు మేజర్ పంచాయితీ ప్రత్యేకాధికారిణి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు తాగునీటి పధకాలను పరిశీలిస్తూ, లీకేజీలను అరికడుతూ ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన సున్నం, బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ ద్రావణాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి పారిశుద్ధ్యమును మెరుగు పరుస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా చెత్తా చెదారమును విచ్చలవిడిగా రోడ్లుపై పడవేయరాదన్నారు. ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికులు వింజమూరులోని అన్ని ప్రాంతాలకు వస్తుంటారని, చెత్తను వారికి అందించిన పక్షంలో ప్రత్యేక వాహనాల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తామన్నారు. ఫలితంగా నివాస గృహాల వద్ద అపరిశుభ్ర వాతావరణమును పారద్రోలవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసే వరకు కూడా స్వీయ నిర్భంధంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఇ.ఓ శ్రీనివాసులురెడ్డి విజ్ఞప్తి చేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు