ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం. 

*10–05–2020*
*అమరావతి*


*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*


*విశాఖపట్నం :* 
*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*విశాఖలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు
,సీఎస్‌ నీలం సాహ్ని, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం సమీక్ష*
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ సీఎంకు వివరణ
*మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి*


– గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని సీఎం ఆదేశం


–*రేపు ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు  చేపట్టాలని సీఎం ఆదేశం*


–*సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సీఎం ఆదేశం.* 
*వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలన్న ముఖ్యమంత్రి.*


– ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని ఆదేశాలు.
 వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్న సీఎం.


– రేపు ఉదయం మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి 
కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం.


– గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం కోసం ప్రజలెవ్వరూ ఎక్కడా కూడా తిరగకుండా వారికి నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.
పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్న సీఎం. 


– తమకు అందాల్సిన సహాయం కోసం ప్రజలు ఎవ్వరూ కూడా పదేపదే విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి. 


– పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న అంశాన్ని నిపుణులు కూడా చెప్తున్నారంటూ సీఎంకు వివరణ.
 అయినా సరే.. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం.
వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సీఎం గట్టి ఆదేశాలు.
 కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంచేసుకుని ఈ పనిపూర్తిచేయాలన్న సీఎం.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు