డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా  సేవా కార్యక్రమాలు

డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా
 సేవా కార్యక్రమాలు


        గూడూరు, మే 1.(అంతిమ తీర్పు ) :                           శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,  టెక్నో మిన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ మైనింగ్ గ్రూప్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీపి.యం.రావు నెల్లూరు జిల్లాలోనే  మహా దాతగా పేరు సంపాదించుకున్నారు .
  ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య ,అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం   అందించారు.   చైర్మన్ శ్రీ లక్ష్మి పి.యం రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నిరాశ్రయులకు ,అనాధలకు, నిరుపేదలకు  బియ్యం ,భోజనం ,పండ్లను పంపిణీ చేశారు. రైతు కూలీలకు భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ట్రస్ట్ పి ఆర్ వో మల్లవరపు భూషణ్ రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణం గా ప్రజలు ఆర్దికంగా ఇబ్బంది పడకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న లక్ష్యంతో డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మిపి.యం.రావు దంపతులు ట్రస్టు ద్వారా teknomin కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ,రాష్ట్ర ప్రభుత్వానికి  20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  విజయవాడ పోలీస్ కమిషనర్ కు 15 వేల మాస్కులు 8000 గ్లౌసులు అందించారు.  గూడూరు పోలీస్ శాఖ ,రెవెన్యూ శాఖ కు  మాస్కులు, శానిటైజర్లు అందించారు.  కూరగాయలు పండించే రైతులు నష్ట పోకూడదు అని  ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద రైతుల వద్ద భారీగా కూరగాయలు కొనుగోలు చేసి గూడూరు పట్టణం, గూడూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నిరుపేదలు రెండు వేల మందికి కూరగాయలను పంపిణీ చేశారు.   గుంటూరు ప్రాంతంలోని సిరిపురం, విజయవాడ ప్రాంతాల్లో కూడా పేదలకు కూరగాయలు పంపిణీ చేసారు.  అలాంటి మహాదాత డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మి గారి జన్మదినం పదిమందికి ఉపయోగపడే గా ఉండాలనే సంకల్పంతో ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బియ్యం, పండ్లు, భోజనాలను పంపిణి చేసామన్నారు.ట్రస్టు ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసే విధంగా పి.యం రావు దంపతులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభు వెంకటరమణారెడ్డి  ట్రస్టు సిబ్బంది ఉదయ్ కిరణ్,  నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.