ప్రతీ నెలా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ లో ఉండాలన్నారు.

 విశాఖపట్నం .. మే 11..


         రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్  కుమార్ ప్రసాద్, పీ సి బి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఎన్ డీ ఆర్ ఎఫ్ , వైద్య శాఖ, పరిశ్రమల శాఖ సాంకేతిక నిపుణులతో  సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. 


       ఈ నెల 7 వ తేదీన జరిగిన ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన  నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన  క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందించడం, సంబందిత గ్రామాల ప్రజలను దూరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు పెద్ద ప్రమాదం నుండి తప్పించ గలిగారన్నారు. 
       గ్యాస్ లీకెజ్  సంభవించడానికి గల కారణాలు, ప్రస్తుతం తీసుకుంటున్న  చర్యలు తదితరాల తో కూడిన పూర్తి నివేదికను తయారు చేయాలని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాన్ని కోరారు.
            ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల గూర్చి వైద్యాధికారుల ను ఆరా తీశారు. డిశ్చార్జ్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరికీ అన్నిరకాల టెస్ట్లనునిర్వహించాలన్నారు.ముఖ్యంగా  చిన్న పిల్లలు, లంగ్స్, కిడ్నీ, హార్ట్ తదితర దీర్ఘకాలిక రోగుల పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. డిశ్చార్జ్ అయిన వారందరినీ మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతీ నెలా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ లో ఉండాలన్నారు.


     గ్యాస్ ప్రభావిత గ్రామాలలో  చెరువులు,నీటి కాలువలు, బావులలో నీటి శాంపిల్స్, మట్టి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలన్నారు. పశువులు, పెంపుడు జంతువుల కు  సంబంధించి పశుసంవర్ధక శాఖ , వైల్డ్ ఆనిమల్స్ కు సంబంధించి అటవీ శాఖ ఆయా పరిస్థితుల పై నివేదికను అందజేయాలన్నారు.
       ఆయా గ్రామాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా  తమ ఇళ్లకు వెళ్లే వారు వ్యక్తి గత రక్షణ నిమిత్తం తప్పని సరిగా మాస్క్ లను ధరించడం,ఇంటి కిటికీలు తెరచి బాగా గాలి వెళ్లే విధంగా చూడడం,ఫ్యాన్లు, ఏసీ లు వాడకుండా చేపట్టాల్సిన జాగ్రత్త లను గూర్చి వారికి అవగాహన కల్పించాలన్నారు.
     ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా తిరుపతి రావు, డీ సి హెచ్ ఎస్ డా నాయక్, కే జి హెచ్ సూపరింటెడెంట్ డా అర్జున, ఎన్ డీ ఆర్ ఎఫ్ , సాంకేతిక నిపుణుల బృందం తదితరులు హాజరయ్యారు.
     
,


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image