కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లా క్ డౌన్ సందర్భం గా  రైతులను విస్మరించడం సరైనది కాదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లా క్ డౌన్ సందర్భం గా  రైతులను విస్మరించడం సరైనది కాదు


కౌతాళం,మే,16 (అంతిమతీర్పు):-కౌతాళం మండలంలోని ఏపీ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్  కమిటీ పిలుపు మేరకు లాక్ డౌన్  వల్ల అన్నదాతలు కష్టాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తూ సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలకు అభినందన అభినందన సభను శనివారం  ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బి.పమన్న అనే రైతును పూలమాలతో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య సన్మానం చేయడం చేశారు.రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ కేంద్ర   ప్రభుత్వము 20 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం  రైతులను ఆదుకోవడానికి ఎటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. రైతు రేయింబవళ్లు కష్టపడి  పంటలు పండిస్తున్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు.రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి,రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలి,రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ,మద్దతు ధర కల్పించాలి,.రైతులకు ఉచితముగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందించాలి.                    రైతులకు  పెట్టుబడి సాయం రు 13,500 నుండి  18,000 రూపాయలు కుపెంచాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం మండల కార్యదర్శి ఈరన్న, నాయకులు ఉల్లి కయ్య ,కార్యకర్తలు హనుమంతు, కరిలింగా, గోవిందు , వీరేష్, ముకన్న, శేఖర్ , వెంకన్న, వలి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు