ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశ పెట్టాలి : బిజెపి

అమరావతి, మే 6 (అంతిమ తీర్పు) :


*"మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోసం అంత ఆత్రం ఎందుకు ? ఏపీలో 12జిల్లాలకు కరోనాతో ముప్పు ఉన్న వేళ సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తానన్న సీఎం గారు ఏ ఆలోచనతో మద్యం దుకాణాలు తెరిచారు? ఆదాయమే లక్ష్యంగా షాపులు తెరిచి వినియోగదారులను కంట్రోల్ చెయ్యలేక  రాష్ట్రాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేశారు."*
- *బిజెపి ఆంధ్రప్రదేశ్*


🔸సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన వైకాపా ప్రభుత్వం తర్వాత దశల వారీ నిషేధం అని మాట మార్చింది. ఇప్పుడు మద్యపాన నిషేధం చేసే అవకాశం వస్తే ఆదాయం కోసం వెంపర్లాడుతోంది.


🔸కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే అంశాన్ని తుంగలో తొక్కి 
  కేంద్రం చెబితే దుకాణాలు ప్రారంభించామని తమ ప్రమేయం లేదని మాట్లాడడం సరికాదు.మద్యం అమ్మకం- ఆదాయం రాష్ట్ర పరిధిలోని అంశం.


🔸రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరిచి మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మార్చేందుకు వైకాపా ప్రభుత్వం కారణమౌతోందని, గ్రీన్ జోన్లను ఆరెంజ్, రెడ్ జోన్లుగా మార్చే విధంగా వైకాపా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.


🔸మద్యం విక్రయాలతో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవడమే కాకుండా, మందు తాగే వ్యక్తులను అదుపు చేయడం కోసం ఉపాధ్యాయులను వినియోగించడం మహా పాపమని, ఘోర తప్పిదమని, చదువు చెప్పే గురువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విలువ అర్థం అవుతోంది.


🔸మందు బాబులను అదుపు చేయడానికి రాష్ట్రంలో ఉపాధ్యాయులను వినియోగించి గురువులను రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది.


🔸ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మద్యం దుకాణాలు తెరవకుండా ఉంచారన్న విషయం తెలియదా అని..
రాష్ట్ర ప్రభుత్వాల సొంత నిర్ణయంతో మద్యం విక్రయాలు కట్టడి చేసే అవకాశం ఉందని తెలియదా అని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తోంది..



🔸గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మద్యపాన నిషేధం మాట తప్పి జాతీయ రహదారులను కూడా మద్యం అమ్మకాల కేంద్రాలుగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈరోజు మద్యపాన నిషేధం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.


🔸ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తెరచి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసిందని, ఇన్నాళ్లూ వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి అత్యవసర సిబ్బంది పడిన కష్టం అంతా బూడిదలో పోసినట్లు అయింది.



🔸మద్యం షాపులవద్ద ఎక్కడా భౌతిక దూరం పాటించటంలేదని, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలల్లో  
మద్యం షాపుల వద్ద  గుమిగూడిన జనాన్ని చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తీరువల్ల కొరొనా వైరస్ మరలా విజృంభించే ప్రమాదం ఉంది.


🔸రెడ్ జోన్ లో అమ్మకాలు నిలిపివేసిన ప్రభుత్వం అక్కడి వారిని నియత్రించలేకపోతోందని వారంతా ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో స్వేచ్ఛగా తిరుతున్నారని, మద్యం దుకాణాల పేరిట జోన్ల వ్యవస్థ చెరిగిపోయి కరోన సామూహిక వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది.


🔸 ప్రభుత్వం అసంబద్ధ విధానాలు, అవగాహనా రాహిత్యంతో ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తోంది.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
1. కొరొనా నియంత్రణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం  తక్షణం మద్యం దుకాణాలు మూసి వేయాలని  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.


2. లాక్ డౌన్ కారణంగా సుమారు నలభై రోజుల పాటు మద్యం దొరకక పోవడంతో కొంత వరకు మద్య నిషేధం అలవాటు అయిందని ఈ నేపథ్యంలో తక్షణమే మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏపి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.


3. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా చేసి ఉపాధ్యాయులను అవమానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తోంది.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image