ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశ పెట్టాలి : బిజెపి

అమరావతి, మే 6 (అంతిమ తీర్పు) :


*"మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోసం అంత ఆత్రం ఎందుకు ? ఏపీలో 12జిల్లాలకు కరోనాతో ముప్పు ఉన్న వేళ సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తానన్న సీఎం గారు ఏ ఆలోచనతో మద్యం దుకాణాలు తెరిచారు? ఆదాయమే లక్ష్యంగా షాపులు తెరిచి వినియోగదారులను కంట్రోల్ చెయ్యలేక  రాష్ట్రాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేశారు."*
- *బిజెపి ఆంధ్రప్రదేశ్*


🔸సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన వైకాపా ప్రభుత్వం తర్వాత దశల వారీ నిషేధం అని మాట మార్చింది. ఇప్పుడు మద్యపాన నిషేధం చేసే అవకాశం వస్తే ఆదాయం కోసం వెంపర్లాడుతోంది.


🔸కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే అంశాన్ని తుంగలో తొక్కి 
  కేంద్రం చెబితే దుకాణాలు ప్రారంభించామని తమ ప్రమేయం లేదని మాట్లాడడం సరికాదు.మద్యం అమ్మకం- ఆదాయం రాష్ట్ర పరిధిలోని అంశం.


🔸రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరిచి మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మార్చేందుకు వైకాపా ప్రభుత్వం కారణమౌతోందని, గ్రీన్ జోన్లను ఆరెంజ్, రెడ్ జోన్లుగా మార్చే విధంగా వైకాపా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.


🔸మద్యం విక్రయాలతో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవడమే కాకుండా, మందు తాగే వ్యక్తులను అదుపు చేయడం కోసం ఉపాధ్యాయులను వినియోగించడం మహా పాపమని, ఘోర తప్పిదమని, చదువు చెప్పే గురువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విలువ అర్థం అవుతోంది.


🔸మందు బాబులను అదుపు చేయడానికి రాష్ట్రంలో ఉపాధ్యాయులను వినియోగించి గురువులను రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది.


🔸ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మద్యం దుకాణాలు తెరవకుండా ఉంచారన్న విషయం తెలియదా అని..
రాష్ట్ర ప్రభుత్వాల సొంత నిర్ణయంతో మద్యం విక్రయాలు కట్టడి చేసే అవకాశం ఉందని తెలియదా అని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తోంది..



🔸గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మద్యపాన నిషేధం మాట తప్పి జాతీయ రహదారులను కూడా మద్యం అమ్మకాల కేంద్రాలుగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈరోజు మద్యపాన నిషేధం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.


🔸ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తెరచి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసిందని, ఇన్నాళ్లూ వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి అత్యవసర సిబ్బంది పడిన కష్టం అంతా బూడిదలో పోసినట్లు అయింది.



🔸మద్యం షాపులవద్ద ఎక్కడా భౌతిక దూరం పాటించటంలేదని, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలల్లో  
మద్యం షాపుల వద్ద  గుమిగూడిన జనాన్ని చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ తీరువల్ల కొరొనా వైరస్ మరలా విజృంభించే ప్రమాదం ఉంది.


🔸రెడ్ జోన్ లో అమ్మకాలు నిలిపివేసిన ప్రభుత్వం అక్కడి వారిని నియత్రించలేకపోతోందని వారంతా ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో స్వేచ్ఛగా తిరుతున్నారని, మద్యం దుకాణాల పేరిట జోన్ల వ్యవస్థ చెరిగిపోయి కరోన సామూహిక వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది.


🔸 ప్రభుత్వం అసంబద్ధ విధానాలు, అవగాహనా రాహిత్యంతో ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తోంది.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
1. కొరొనా నియంత్రణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం  తక్షణం మద్యం దుకాణాలు మూసి వేయాలని  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.


2. లాక్ డౌన్ కారణంగా సుమారు నలభై రోజుల పాటు మద్యం దొరకక పోవడంతో కొంత వరకు మద్య నిషేధం అలవాటు అయిందని ఈ నేపథ్యంలో తక్షణమే మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏపి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.


3. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా చేసి ఉపాధ్యాయులను అవమానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తోంది.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image