క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం ఆదేశం

01–05–2020
అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం     వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి:
*– కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ్   వైయస్‌.జగన్‌ సమీక్ష*
*– వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు*


*క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం ఆదేశం


– క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలి: సీఎం
– వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణబాబుకు సీఎం ఆదేశం
–  సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారుల వెల్లడి
– క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని సీఎంకు తెలియజేసిన అధికారులు


*ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి వచ్చేవారికి స్క్రీనింగ్, అవసరమైన వారికి క్వారంటైన్‌:*


– లాక్‌డౌన్‌ సడలింపులు నేపథ్యంలో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో చర్చ
– వీరిని స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ.
– వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న సీఎం
– ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి, ఎవర్ని ఎక్కడ పెట్టాలి అన్నదానిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం
– క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్న సీఎం
– అలాగే వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని అ«ధికారులను ఆదేశించిన సీఎం
– దీనికి సన్నద్ధం కావాలని ఆదేశించిన సీఎం


– విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, 
వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని తెలిపిన అధికారులు
– అలాగే గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని,
అలాగే శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆ«ధారంగా ఇళ్లకు పంపిస్తామని తెలిపిన అధికారులు


*రాష్ట్రంలో లక్ష దాటిన కోవిడ్‌ –19 పరీక్షలు, ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువలో పరీక్షలు:*


– రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ –19 పరీక్షలు
– నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు
– ప్రతిమిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే అగ్రస్థానం. ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువలో పరీక్షలు


– ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు
– 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు
– 68 యాక్టివ్‌  క్లస్టర్లు
– 53 డార్మంట్‌ క్లస్టర్లు 
– 35  క్లస్టర్లలో  28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించిన అధికారులు. 


*కోవిడ్‌ –19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం:*


– కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారుల వెల్లడి.
– వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తింపు
– వీరికి పరీక్షలు చేసి... లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశం
–  కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు
– జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని ఆదేశం
– హైరిస్క్‌ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి
ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు


– టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం
– భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం
– టెలీమెడిసిన్‌ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ద్వారా మందులు సరఫరాచేయడం జరగాలన్న  ముఖ్యమంత్రి.
 
*వ్యవసాయం, అనుబంధ రంగాలు:*


– ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందన్న అధికారులు.
– ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ. 
– దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌
– ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్న సీఎం
– చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని,  వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.  రైతులకు  అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టంచేసిన సీఎం. 


– పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవన్న సీఎం
– అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
– చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.
– వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌  సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. 


*రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లు:*


–  రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలని సీఎం ఆదేశం
– ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలన్న సీఎం
– ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముడు పోయే అవకాశాలున్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలి
– ప్రతి ఊర్లోకూడా ఏయే పంటలు ఎంతమేర పండించాలన్నదానిపై రైతులతో కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలన్న ముఖ్యమంత్రి
– జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆమేరకు కార్యాచరణ ఉండాలన్న ముఖ్యమంత్రి
– రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు సీఎం ఆదేశం
– ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలి. 
– ఈ బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
– రాష్ట్రస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడనుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి
– పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి
– దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది.
– పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం.. ఈప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృతంగా సాగిపోవాలి. 


– గత ప్రభుత్వం హయాంలో ఏరోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టి విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంతచేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాలన్న సీఎం.