రుయాలో వైద్య వసతులు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలి.. జిల్లా కలెక్టర్

 


రుయాలో వైద్య వసతులు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలి.. జిల్లా కలెక్టర్


తిరుపతి, మే 04 : రుయా ఆసుపత్రి కోవిడ్ కు ప్రాధాన్యత నేపధ్యంలో ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య వసతులు పై జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే మెడిసిన్ వార్డు లో కోవిడ్  150 పడకలు వున్నాయని, మరో 200 పాత మెటర్నేటీ సిద్దంగా ఉందని, అలాగే ఒకటి నిండితే తరువాత మరోకటి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రుయాలో మార్పు చేయదలచిన వార్డులో పనులు పూర్తి కావాలని వసతులు టాయిలెట్ లు, ఆక్సిజన్ లైన్ లు, బెడ్లు వంటివి సిద్ధంగా ఉండాలని సూచించారు. పిపిఐలు, ఎన్95 మాస్కులు అవసరాలను అడిగి తెలుసుకున్నారు.


రుయా సూపరినెంట్ భారతి వివరిస్తూ ఎం.ఆర్.ఐ, సిటీ స్కాన్ పనిచేస్తున్నాయని నేడు ఒపి ప్రారంభించామని 382 మంది రోగులకు వైద్య సేవలు అందించామని అందులో 100 మంది కి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని వివరించారు. ఇన్ పేషేంట్లను 22 మందిని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రలకు పంపామని తెలిపారు. ఓపి పేషంట్ల కోవిడ్  రిజల్టు వచ్చే వరకు పేషేంట్ల అటెండర్స్ వసతి కోసం ధార్మిమిటరీ కావాలని ,  నేటి వరకు 32 మంది కొత్తగా  డాక్టర్లు విధుల్లో చేరారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ తో ఆక్సిజన్ సరిపోతుందని వివరించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ లు కావాలని కోరారు.


ఈసమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్, ఆర్.ఎం.ఓ. ఇబి దేవి, సరస్వతి, ఏపీఎం ఐడిసి ఇఇ ధనంజయ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాల ఆంజనేయులు , తదితరులు పాల్గొన్నారు.


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు