దిశ’ పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

14–05–2020
అమరావతి


దిశ’ పై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష
*చట్టం ఆమోదం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశం*
*ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన దిశ పోలీస్‌స్టేషన్, ఒన్‌స్టాప్‌ సెంటర్, డీ అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆదేశాలు*
*ప్రతి నెలా ‘దిశ’పై సమీక్ష*
*6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు*
*ఆవిష్కరించిన సీఎం*
*తర్వాత దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌*



అమరావతి:
‘దిశ’పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
హోం మంత్రి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు
దిశ అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ తదితరుల హాజరు


– దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న దానిపైనా ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలి: సీఎం
– అలాగే స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే కాకుండా మిగతా ఫోన్లలో కూడా ‘దిశ’ యాప్‌ సదుపాయాలు ఉండేలా చూడాలి: సీఎం
– దీని కోసం సంబంధిత కంపెనీలతో మాటాడాలన్న సీఎం 
– దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలి:
– అలాగే ప్రత్యేక కోర్టులు వీలైనంత త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలి:
– ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం వీలైనంత త్వరగా చేయాలి: 
– వేగంగా కేసుల విచారణ జరిగేలా చూడాలి:
– దిశ అమలు కోసం ప్రత్యేక వాహనాలు కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశం
– ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం
– ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక డీ అడిక్షన్‌ సెంటర్‌ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
– కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రుల్లో డీ అడిక్షన్‌ సెంటర్‌ కూడా ఒక విభాగంగా కలుపుకుని నిర్మాణాలు చేపట్టాలన్న సీఎం
– దీని వల్ల శాశ్వత ప్రాతిపదికన డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందన్న సీఎం
– అలాగే ప్రస్తుతం ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా డీ అడిక్షన్‌ సెంటర్ల నిర్మాణం చేయాలన్న సీఎం
– ఒన్‌ స్టాప్‌ సెంటర్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా ఇందులో భాగం చేయాలన్న సీఎం
– ఒన్‌ స్టాప్‌ సెంటర్లను కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఏర్పాటు చేసుకోవాలి.
– దిశ పోలీస్‌స్టేషన్లు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి ఉండేలా చూసుకోవాలి: సీఎం
– దిశ మీద ప్రతి నెలా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్న సీఎం


6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు ఆవిష్కరించిన సీఎం:
తర్వాత దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌:


– సమీక్ష తర్వాత అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను ఆవిష్కరించిన సీఎం
– సర్టిఫికెట్లు జారీని వివరించిన సౌత్‌ ఇండియా ఐఎస్‌ఓ జనరల్‌ మేనేజర్, డాక్టర్‌ ఎలియాజర్,
– విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్‌ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు
– త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు రానున్న సర్టిఫికెట్‌
– ఈ సందర్భంగా 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌. పాల్గొన్న జిల్లా ఎస్పీలు, ఇతర అధికారులు


167 కేసులు వారం రోజుల్లో డిస్పోజ్‌ చేశామని అధికారులు చెప్తున్నారు:
చాలా సంతృప్తికరంగా ఉంది:
మీరు చాలా ఎఫెర్ట్‌ పెట్టారు. దీని వల్ల ఎలా మార్పులు వస్తున్నాయో చూపిస్తున్నారు:
దిశ పోలీస్‌ స్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ, మరియు ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. చాలా ఎఫెర్ట్‌ పెడుతున్నారు:
మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి:
దిశ యాక్ట్, స్పెషల్‌ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం:
ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం:
అలాగే ఫోరెన్సిక్‌ సిబ్బంది నియామకం, నిర్మాణం కోసం నిధులు కూడా విడుదల చేశాం:
ప్రతి దిశ పోలీస్‌స్టేషన్లలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూస్తారు:
నెలకోసారి దిశ మీద సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం:
మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే :
మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం:
మనకు హోం మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్‌ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కృతిక, దీపిక కూడా మహిళలే:


 


‘దిశ’ ప్రవేశపెట్టిన జనవరి నుంచి చురుగ్గా కార్యకలాపాలు
7 రోజుల్లోగా ఛార్జిషీటు నమోదు, త్వరితంగా శిక్షల ఖరారులో ముందడుగు
మహిళలపై నేరాలు 134, చిన్నారులపై నేరాలు 33
167 కేసుల్లో 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు
3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో శిక్షలు
ఇందులో 2 మరణశిక్షలు, 5 జీవిత ఖైదులు
20 ఏళ్ల శిక్ష 1, ఏడేళ్ల శిక్ష  5, 3 ఏళ్ల శిక్ష పడ్డ కేసులు 3, మూడునెలల శిక్ష 3, జువనైల్‌హోంకు ఒకరిని పంపారు.
ప్రత్యేక కోర్టులు లేకున్నా.. సరైన ఆధారాల సేకరణ, వేగవంతమైన విచారణల కారణంగా ఈ శిక్షలు పడేలా చేయగలిగామన్న అధికారులు


దిశ యాప్‌ను 2.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్న అధికారులు
19,918 ఎస్‌ఓఎస్‌ రిక్వెస్ట్‌లు రిసీవ్డ్‌
ఫిబ్రవరి 9 నుంచి 292 ఘటనల్లో చర్యలు
68 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
భర్త ద్వారా వేధింపులు 93
మహిళలపై వేధింపులు 42
గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వేధింపులు 42
బంధువుల ద్వారా వేధింపులు 29
ఇతరుల ద్వారా వేధింపులు 21
పబ్లిక్‌ న్యూసెన్స్‌ 17
ఫేక్‌ కాల్స్‌ 15
చిన్నారులపై వేధింపులు 8
మహిళల అదృశ్యం 7
సివిల్‌ వివాదాలు 7
బాలికల అదృశ్యం 5
మిగిలినవి ఇతర కేసులు
 
– 100,112,191, మరియు దిశ ఎస్‌ఓఎస్‌ కాల్స్‌ ద్వారా సహాయం కోసం ఏ మహిళ చేసినా వెంటనే చర్యలు
– మహిళలు, చిన్నారుల పట్ల స్నేహ పూర్వక వాతావరణం
– ప్రత్యేక పీపీపీలతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోగా శిక్షలు వేయించేలా చర్యలు
– గృహ హింస, మద్యపానం వల్ల చోటుచేసుకున్న హింసలపై ప్రత్యేక దృష్టి. విస్తృతంగా కౌన్సెలింగ్‌.
– ఈ కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసులు, వాలంటీర్ల భాగస్వామ్యం.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image