బ‌హిరంగ లేఖ‌

  బ‌హిరంగ లేఖ‌
శ్రీ వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారికి......
ముఖ్యమంత్రి వ‌ర్యులు, 
ఆంధ్రప్రదేశ్‌,
న‌మ‌స్కార‌ముల‌తో… 
      విషయం:- *స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్న‌ వ‌ల‌స కార్మికుల‌ను స్వస్థలాల‌కు  చేర్చేందుకు నేను సిద్ధం.           రాష్ట్రంలోని జిల్లాకు 2 బస్సులు, తెలంగాణకు 10 బస్సులు నా సొంత ఖ‌ర్చుల‌తో  ఏర్పాటు చేసి తిరిగి తెచ్చేందుకు అనుమ‌తి కోరుతున్నాను.*
        గుంటూరు జిల్లా సత్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేలాది మంది వ‌‌ల‌స ‌కార్మికులు  పొట్ట‌కూటి కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి ప‌నులు చేసుకుంటున్నారు.   లాక్ డౌన్ ప్ర‌భావంతో ఎక్క‌డి వాళ్లు అక్క‌డే ఆగిపోయిన ప‌రిస్థితి.  ఉపాధి లేక క‌నీసం తిన‌డానికి తిండి లేక బ్రతుకు బండి గుదిబండ‌లా మారాయి.  ఆర్ధిక ఇబ్బందులు తాళ‌లేక తెగించి‌ దూరాన్ని లెక్కచేయ‌కుండా గ‌మ్యస్థానాల‌కు చేరేందుకు న‌డుం బిగించి కాలిన‌డ‌క‌న ప‌య‌న‌మ‌వుతున్నారు. 
ఒక ప్రజా నాయ‌కుడిగా స‌త్తెన‌ప‌ల్లి ప్రజ‌ల బాధ‌లు, క‌ష్టాలు తీర్చాల్సిన నైతిక బాధ్యత నాపై ఉంది.  ఇప్పటికే స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది మంది పేద ప్రజలకు, అసంఘటిత కార్మికులు, వలస కూలీలకు  నిత్యావ‌స‌ర స‌రుకులు, కూర‌గాయ‌లు, ఆర్ధిక సాయం అందించి వారికి అండ‌గా నిలిచాను. అలాగే స‌త్తెన‌ప‌ల్లి నుంచి  వ‌ల‌స వెళ్లిన  కార్మికుల‌ను  బస్సులు వివిధ రవాణా సౌకర్యాలు కల్పించి వారి స్వస్థలాల‌కు చేర్చే  బాధ్యతను తీసుకుంటాను. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 2 బస్సులు అలాగే తెలంగాణలో చిక్కుకున్న  స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌ల‌ను తెచ్చేందుకు 10 బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.  తగిన సౌకర్యాలు కల్పించి అందుకు అయ్యే వ్యయ‌మంతా నేను భరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాను. ద‌య‌చేసి అనుమ‌తినించ‌వ‌ల్సిందిగా కోరుచున్నాను. 
         ఇట్లు
 రాయ‌పాటి రంగ‌బాబు
 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర              కార్యద‌ర్శి


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image